News March 25, 2024

28న సిద్దిపేటలో స్పాట్ అడ్మిషన్లు

image

సిద్దిపేటలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో ఈనెల 28వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కవిత తెలిపారు. గ్రూప్ 1, 2, 3,4, ఎస్ఎసీసి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, ఎస్సై, కానిస్టేబుల్ తదితర కేంద్ర, రాష్ట్ర స్థాయి ఉద్యోగాల కోసం ఫౌండేషన్ కోర్సు ద్వారా మూడు నెలల పాటు శిక్షణ ఇస్తామని చెప్పారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News December 15, 2025

MDK: గతంలో పారిశుద్ధ్య కార్మికుడు.. నేడు ఉపసర్పంచ్

image

ఐదేళ్లుగా పారిశుద్ధ్య కార్మికుడు, ట్రాక్టర్ డ్రైవర్‌గా విధులు నిర్వహించిన యువకుడు ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. నార్సింగి మండలం శేరిపల్లికి చెందిన చెప్యాల విజయ్ కుమార్ గ్రామంలో రెండో వార్డులో పోటీ చేసి 36 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో గ్రామంలో గత రాత్రి జరిగిన ఉపసర్పంచ్ ఎన్నికల్లో విజయ్ కుమార్‌ను ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

News December 15, 2025

మెదక్: 12 చోట్ల ఉప సర్పంచ్ ఎన్నికలు

image

మెదక్ జిల్లాలో నిన్న జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఉపసర్పంచ్ ఎన్నిక జరగనిచోట ఈరోజు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 142 పంచాయతీలలో ఎన్నికలు జరగ్గా 12 చోట్ల ఉపసర్పంచ్ ఎన్నికలు కొన్ని అనివార్య కారణాలవల్ల జరగలేదని డీపీఓ యాదయ్య తెలిపారు. ఈరోజు వార్డు సభ్యులకు నోటీసు జారీ చేసి ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నట్లు చెప్పారు.

News December 15, 2025

చేగుంట: 4 ఓట్ల తేడాతో గెలుపు

image

చేగుంట మండలం పోలంపల్లి సర్పంచిగా కొండి రాజ్యలక్ష్మి విజయం సాధించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థి రాజ్యలక్ష్మి సమీప ప్రత్యర్థి తప్ప మేనకపై 4 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తమకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు వారు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.