News February 27, 2025

14 నెలల పాలనలో 4 ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి: హరీశ్ రావు

image

TG: రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను కాపాడలేని దుస్థితిలో INC ప్రభుత్వం ఉందని BRS MLA హరీశ్ రావు మండిపడ్డారు. కృష్ణా జలాలను AP తరలించుకుపోతుంటే చోద్యం చూస్తోందని దుయ్యబట్టారు. గోదావరిపై బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తుంటే నోరెత్తడం లేదని ఫైరయ్యారు. SLBC టన్నెల్ వద్ద ఆయన మాట్లాడుతూ ‘కాంగ్రెస్ 14 నెలల పాలనలో 4 ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. SLBC వద్ద శిథిలాల తొలగింపులో వేగం పెంచాలి’ అని పేర్కొన్నారు.

Similar News

News February 27, 2025

నీటిని జాగ్రత్తగా వాడుకోండి.. AP, TGలకు KRMB సూచన

image

తెలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలతో కేఆర్ఎంబీ సమావేశం ముగిసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో తక్కువ నీరు ఉన్నందున వృథా కాకుండా జాగ్రత్తగా వాడుకోవాలని సూచించింది. తాగు, సాగు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలంది. 15 రోజులకోసారి ఇరు రాష్ట్రాల అధికారులు పరిస్థితులను సమీక్షించుకోవాలని ఆదేశించింది. రెండు ప్రాజెక్టుల నుంచి తమకు 55TMCలు కావాలని ఏపీ, 63TMCలు ఇవ్వాలని తెలంగాణ కోరిన విషయం తెలిసిందే.

News February 27, 2025

$: సెంచరీ దిశగా..!

image

అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనమవుతోంది. పది సంవత్సరాల్లో రూపాయి విలువ ఎంతలా పడిపోయిందో ఓ నెటిజన్ వివరించారు. 2015లో ఒక్క డాలర్‌కు రూ.65.87 కాగా ఇది 2020లో రూ.73.78కి చేరింది. 2024లో రూ.84.79 ఉండగా ఈరోజు డాలర్ విలువ రూ.87.17గా ఉంది. రోజురోజుకీ పెరుగుతూ పోతుండటంతో ఇది త్వరలోనే రూ.100కు చేరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

News February 27, 2025

SHOCK: ఇడ్లీ శాంపిల్స్‌లో క్యాన్సర్ కారకాలు

image

హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీల్లో కార్సినోజెనిక్స్(క్యాన్సర్ కారకాలు) ఉండటం కర్ణాటకలో దుమారం రేపింది. దీంతో వాటి తయారీలో ప్లాస్టిక్ వాడకాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఇడ్లీ ప్లేటులో పిండి వేశాక దానిపై క్లాత్ బదులు ప్లాస్టిక్ షీట్లు వేస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో 251 శాంపిల్స్‌ను పరీక్షించారు. 52 హోటళ్లు ప్లాస్టిక్ వాడినట్టు తేలింది. దీంతో AP, TGలోనూ తనిఖీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

error: Content is protected !!