News November 19, 2025

43 మంది నేతలకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు

image

బిహార్‌లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా 43 మంది సీనియర్ నేతలకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని వారిపై క్రమశిక్షణ కమిటీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఈనెల 21 లోగా రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆ లోపు స్పందించకపోతే పార్టీ నుంచి తొలగింపు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Similar News

News January 23, 2026

ఏ శుభకార్యానికైనా నేడు ఉత్తమ దినం!

image

నేడు వసంత పంచమి. చదువుల తల్లిని కొలిచే పవిత్రమైన రోజు. ఇది అక్షరాభ్యాసాలకే కాకుండా వివాహం, అన్నప్రాశన, గృహప్రవేశం వంటి ఎన్నో శుభకార్యాలకు ఎంతో శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. ఈ పర్వదినాన చేసే ఏ కొత్త పనికైనా దైవబలం తోడై విజయవంతం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నేడు ఏ రంగు దుస్తులు ధరిస్తే, వేటిని పూజిస్తే సరస్వతీ దేవి కటాక్షంతో నైపుణ్యాలు పెరుగుతాయో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News January 23, 2026

శ్రీనిధి రకం కోళ్ల ప్రత్యేకత ఏమిటి?

image

శ్రీనిధి జాతి కోళ్లు గోధుమ రంగులో ఉంటాయి. నాటుకోడి గుడ్లకు సమానంగా ఈ కోడి గుడ్లు కూడా అధిక పోషకాలను కలిగి ఉంటాయి. ఈ కోళ్లు 5 నెలల వయసు నుంచే గుడ్లను పెట్టడం ప్రారంభిస్తాయి. ఏడాదికి 140 నుంచి 160 గుడ్లను పెడతాయి. అన్ని వాతావరణ పరిస్థితులను, కొన్ని రకాల వ్యాధులను తట్టుకొని జీవిస్తాయి. పొడవైన కాళ్లతో, ఆకర్షణీయంగా ఉంటాయి. పెరటికోళ్లు పెంచాలనుకునేవారికి శ్రీనిధి కోళ్లు కూడా అనుకూలమైనవి.

News January 23, 2026

నేడు వసంత పంచమి.. ఈ పనులు చేయకండి

image

వసంత పంచమిని జ్ఞానాన్ని వృద్ధి చేసుకునే రోజుగా చెప్తారు. ఇవాళ పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ‘దీనిని ప్రకృతి పండుగగా భావిస్తారు. నేడు వసంత రుతువు ప్రారంభమవుతుంది. అందుకే చెట్లు, మొక్కలకు హాని చేయకూడదు. నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. అవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. ఇవాళ శుక్రుడు అస్తమిస్తున్నాడు. అందుకే శుభకార్యాలు, వ్యాపారాలు ప్రారంభించొద్దు’ అని సూచిస్తున్నారు.