News March 28, 2024

పదేళ్లలో రూ.5.3 లక్షల కోట్ల బ్యాంకు మోసాలు

image

2013-2023 మధ్య ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో 4.62 లక్షల మోసాలు జరిగినట్లు RBI వెల్లడించింది. పదేళ్లలో ₹5.3 లక్షల కోట్ల స్కామ్‌లు జరిగాయని RTI దరఖాస్తుకు ఇచ్చిన సమాధానంలో తెలిపింది. ‘రుణాలు, కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పద్ధతిలోనే ఎక్కువ మోసాలు జరిగాయి. మహారాష్ట్రలో అత్యధిక స్కామ్‌లు బయటపడగా, ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, హరియాణా, తమిళనాడు, UP, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ ఉన్నాయి’ అని పేర్కొంది.

Similar News

News February 18, 2026

TODAY HEADLINES

image

* భారత్-ఫ్రాన్స్ బంధం గ్లోబల్ స్టెబిలిటీకి డైరెక్షన్: మోదీ
* బంగ్లాదేశ్ PMగా తారిఖ్ ప్రమాణం
* రేపటి నుంచే రంజాన్
* AP: మార్చి 8న ‘విద్యాలక్ష్మి, కళ్యాణలక్ష్మి’ ప్రారంభం
* AP: సభకు రాని MLAలను రికాల్ చేయాలి: స్పీకర్
* AP: హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ: సవిత
* రోడ్లు శుభ్రంగా లేకుంటే అధికారుల సస్పెండ్: రేవంత్
* TG: MAR 16 నుంచి ఒంటిపూట బడులు
* ప్రత్యూష కేసు.. నిందితుడు లొంగిపోవాలని సుప్రీం ఆదేశం

News February 18, 2026

వినియోగదారులకు అండగా NCH.. ఫిర్యాదు చేస్తే చాలు!

image

మీరు కొన్న వస్తువు నచ్చకపోయినా లేదా డబ్బులు తిరిగి రాకపోయినా ఇక ఆందోళన వద్దు. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్-1915 (NCH) గత 9 నెలల్లో 79,521 ఫిర్యాదులను పరిష్కరించి, వినియోగదారులకు ఏకంగా ₹52 కోట్లు రిఫండ్ ఇప్పించింది. ముఖ్యంగా ఆన్‌లైన్ షాపింగ్ (ఈ-కామర్స్) మోసాలపై వచ్చిన 47,743 ఫిర్యాదులను పరిష్కరించింది. కోర్టుల చుట్టూ తిరిగే పనిలేకుండా డిజిటల్ పద్ధతిలోనే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

News February 18, 2026

మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

image

AP: ప్రముఖ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తిరుపతిలో MBU వద్ద విద్యార్థి నాయకుల <<19041650>>కిడ్నాప్ కేసులో<<>> అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఫోన్ కాల్స్‌, మెసేజ్‌లను విశ్లేషించి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నివేదిక అందజేయాల్సి ఉందని, ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. క్వాష్ పిటిషన్‌పై విచారణను మార్చి 3కు వాయిదా వేసింది.