News April 2, 2024

యాసంగి ధాన్యం కొనుగోలుకు 7149 కేంద్రాలు

image

TG: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని సీఎస్ శాంతి తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలుకు 7149 కేంద్రాలను ఏర్పాటు చేశామని.. నాలుగైదు రోజుల్లో అవి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రారంభమైన కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News February 13, 2026

బంగ్లాలో BNP విజయం.. మనకెలా లాభం అంటే?

image

బంగ్లాదేశ్‌లో <<19125261>>BNP<<>> గెలవడం భారత్‌కు కొద్దిగా సానుకూల అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో ప్రధాన పార్టీ ‘జమాతే ఇస్లాం’ పూర్తిగా పాకిస్థాన్‌కు తొత్తు అని, అది గెలిచి ఉంటే సమస్యలు వచ్చి ఉండేవని చెబుతున్నారు. బంగ్లాలో హిందువులపై దాడి వెనుక జమాతేనే కీలక సూత్రధారి అనే ఆరోపణలు ఉన్నాయి. అటు BNP అధినేత తారిఖ్ విద్యావంతుడు కావడంతో పాటు ఏ దేశంలో జోక్యం చేసుకోమని ఇప్పటికే స్పష్టం చేశారు.

News February 13, 2026

భగ్గుమంటున్న ధరలు

image

దేశంలో ధరల పెరుగుదల కొనసాగుతోంది. JANలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.75%గా నమోదైంది. రాష్ట్రాల వారీగా TGలో అత్యధికంగా 4.92%గా ఉంటే 2.83%తో AP ఐదో స్థానంలో ఉంది. తొలిసారిగా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్(CPI) ఆధారంగా ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది. 308 వస్తువులు, 50 సేవల ధరలను పరిగణనలోకి తీసుకుంది. వెండి, టమాటా, కొబ్బరి, బంగారం గరిష్ఠ ద్రవ్యోల్బణంలో, ఉల్లి, ఆలుగడ్డ, కందిపప్పు తక్కువ ద్రవ్యోల్బణంలో ఉన్నాయి.

News February 13, 2026

ఓట్ల లెక్కింపు ప్రారంభం

image

TG: రాష్ట్రంలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 123 కేంద్రాల్లో ఓట్లు లెక్కిస్తున్నారు. మధ్యాహ్నం వరకు మున్సిపాలిటీలు, సాయంత్రంలోగా కార్పొరేషన్ల ఫలితాలు వెల్లడి కానున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించాక సాధారణ బ్యాలెట్ పేపర్ల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది.