News April 11, 2024

గ్రూప్-2 మెయిన్స్‌కు 92వేల మంది అర్హత

image

AP: నిన్న విడుదల చేసిన గ్రూప్-2 ప్రిలిమ్స్‌ ఫలితాల్లో మెయిన్స్‌కు 92,250 మంది అర్హత సాధించారు. FEB 25న నిర్వహించిన పరీక్షకు 4,04,039 మంది హాజరు కాగా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేశారు. 1:50 నిష్పత్తిలో ఎంపిక చేయాలని తొలుత భావించినా వీలైనంత ఎక్కువ మందికి మెయిన్స్ రాసే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఒక పోస్టుకు 100 మంది చొప్పున సెలెక్ట్ చేసినట్లు బోర్డు తెలిపింది. జులై 28న మెయిన్స్ జరగనుంది.

Similar News

News December 15, 2025

హీరోయిన్‌ ఈషాతో తరుణ్ భాస్కర్ పెళ్లి?

image

టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వీరు ‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీలో జంటగా నటిస్తున్నారు. షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారినట్లు సినీ వర్గాల్లో టాక్. ఇద్దరూ వరంగల్‌కు చెందిన వారే కావడం గమనార్హం. కాగా తరుణ్‌కి ఇప్పటికే పెళ్లి కాగా, మొదటి భార్యతో విడాకులు తీసుకున్నట్లు సమాచారం.

News December 15, 2025

లంగ్స్‌కు ఇన్సూరెన్స్ ఉందా మెస్సీ?.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు

image

‘గోట్ టూర్‌’లో భాగంగా ఇవాళ ఢిల్లీలో ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ పర్యటించనున్నారు. అయితే ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రంగా ఉండటంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘ఢిల్లీకి స్వాగతం మెస్సీ. మీ ఎడమ కాలికి $900M ఇన్సూరెన్స్ ఉందని విన్నా. మరి లంగ్స్‌కు ఉందా?’ అని ఓ యూజర్ ట్వీట్ చేశారు. మెస్సీ గోల్స్ రికార్డును ఢిల్లీ ఏక్యూఐ బ్రేక్ చేస్తుందని మరొకరు పోస్ట్ చేశారు.

News December 15, 2025

మోదీ, మెస్సీ మీటింగ్ క్యాన్సిల్!

image

ఢిల్లీలో తీవ్ర పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో మెస్సీ టూర్ ఆలస్యమైంది. ఉదయం 11 గంటలకు ఢిల్లీకి చేరుకోవాల్సి ఉండగా మధ్యాహ్నం 2గంటలకు విమానం ల్యాండ్ అయింది. అక్కడి నుంచి హోటల్‌లో గ్రీట్ అండ్ మీట్‌లో పాల్గొని 4PMకు జైట్లీ స్టేడియానికి చేరుకుంటారు. సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌తో సహా కోట్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాగా ఫ్లైట్ ఆలస్యం కారణంగా మోదీతో భేటీ క్యాన్సిల్ అయింది.