News February 27, 2025
TODAY HEADLINES

* ఆదాయం పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం: CM రేవంత్
* సీఎం రేవంత్కు ప్రధాని మోదీ కీలక సూచనలు
* SLBC TUNNEL: రంగంలోకి BSF నిపుణులు
* సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్
* తెలంగాణ వ్యవసాయ కూలీల ఖాతాల్లో డబ్బులు జమ
* 36 సార్లు ఢిల్లీకి.. 3 రూపాయలు తేలేదు: KTR
* మార్చి 7న ‘ఛావా’ తెలుగు వెర్షన్ రిలీజ్
* విమాన ప్రమాదంలో 46కు చేరిన మరణాలు
* ఇంగ్లండ్పై అఫ్గానిస్థాన్ సంచలన విజయం
Similar News
News February 27, 2025
సెలీనియం అంటే?

<<15592975>>సెలీనియం<<>> అనేది నీరు, కొన్ని రకాల ఆహార పదార్థాల నుంచి శరీరానికి సహజంగా అందే ఖనిజం. ఇది థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి, పునరుత్పత్తి అవయవాలు పని చేసేందుకు చాలా అవసరం. దీని అవసరం కొంతే అయినా ఆరోగ్యాన్ని కాపాడటంతో కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ సెలీనియం మోతాదు ఎక్కువైతే జుట్టు రాలడం, గోళ్లు పెలుసుగా మారటం, చర్మ సంబంధ వ్యాధులొస్తాయి. ముఖ్యంగా వెంట్రుకల కుదుళ్లను బలహీనపరిచి జుట్టు రాలడానికి కారణం అవుతుంది.
News February 27, 2025
చేనేత వస్త్రంపై చంద్రబాబు ఫ్యామిలీ ఫొటో

AP: మంగళగిరికి చెందిన టీడీపీ అభిమాని జంజనం మల్లేశ్వరరావు, ఆయన కుమారుడు కార్తికేయ మంత్రి నారా లోకేశ్కు చేనేత వస్త్రాన్ని బహూకరించారు. దానిపై చంద్రబాబు ఫ్యామిలీ ఫొటో ఉండటంతో మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ‘మా కుటుంబసభ్యుల చిత్రాలతో వారు నేసిన చేనేత వస్త్రాన్ని బహూకరించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. అలాగే వీళ్లు నియోజకవర్గంలో చేస్తున్న సామాజిక సేవకు సాయం అందిస్తాం’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.
News February 27, 2025
ఆ 8 మంది చనిపోయి ఉంటారు: అధికారులు

TG: SLBC టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల ప్రాణాలపై అధికారులు ఆశలు వదులుకున్నారు. వాళ్లంతా టీబీఎం మెషీన్ చుట్టూ బురదలో కూరుకుపోయి చనిపోవచ్చని భావిస్తున్నారు. నిన్న ఆర్మీ రెస్క్యూ టీమ్ టన్నెల్ చివరివరకు వెళ్లి చూడగా ప్రమాద స్థలంలో మట్టి, బురద తప్ప మనుషుల జాడ కనిపించలేదు. అక్కడ అత్యంత భయానక పరిస్థితులు ఉన్నట్లు తెలిపారు. శిథిలాలు తొలగిస్తే టన్నెల్ మళ్లీ కూలే ప్రమాదం ఉందంటున్నారు.