News February 27, 2025

ఇంగ్లండ్‌ను ఓడించిన అఫ్గాన్ వెనుక మాస్టర్ మైండ్ ఈయనే..

image

CTలో ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చిన అఫ్గాన్ జట్టు వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జొనాథన్ ట్రాట్‌ కావడం గమనార్హం. 2022లో ఆయన అఫ్గాన్ హెడ్ కోచ్‌గా వచ్చారు. ఆయన నేతృత్వంలోని జట్టు 2023 వన్డే WCలో PAK, ENGకు షాక్ ఇచ్చి, SL, నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. తర్వాత BANపై తొలిసారి వన్డే సిరీస్‌ను, PAKపై T20 సిరీస్‌ను గెలుచుకుంది. ఇప్పుడు CTలోనూ ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

Similar News

News February 27, 2025

స్కీముల కోసం ఆలయాలను డబ్బు అడిగిన ప్రభుత్వం

image

సుఖ్ అభయ్ స్కీముకు ఆలయాలు నిధులు అందించాలంటూ హిమాచల్ ప్రదేశ్ జిల్లా యూనిట్లు కోరడం వివాదాస్పదంగా మారింది. OPS, ఫ్రీబీస్ సహా అప్పుల పాలవ్వడంతో అక్కడి ఖజానా ఒట్టిపోయింది. నిధుల కొరత వల్ల తమ పరిధిలోని 35 మందిరాల నుంచి డబ్బులు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అయితే ఆలయాల డబ్బులను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శిస్తూ BJP ఆందోళనకు దిగడంతో CM సుఖ్వీందర్ సింగ్‌కు ఏం చేయాలో తోచడం లేదు. మీ కామెంట్?

News February 27, 2025

స్టూడెంట్స్ బుక్స్‌లో ₹3.5కోట్లు.. ట్విస్ట్ ఏంటంటే!

image

పుణే ఎయిర్‌పోర్టులో భారీ హవాలా రాకెట్ బయటపడింది. ముగ్గురు స్టూడెంట్స్ దుబాయ్ వెళ్లేందుకు ట్రావెల్ ఏజెంట్ ఖుష్బూ అగర్వాల్ వద్ద టికెట్లు బుక్ చేసుకున్నారు. ఫ్లయిట్ ఎక్కే 2hrs ముందు వారికామె 2 బ్యాగుల్లో బుక్స్ పెట్టి దుబాయ్‌లోని తమ బ్రాంచ్‌లో ఇవ్వమన్నారు. విషయం తెలుసుకున్న కస్టమ్స్ అధికారులు వారిని అక్కడి నుంచి మళ్లీ పుణేకి రప్పించారు. చెక్ చేసి బుక్స్‌లోని $4L (Rs 3.5CR)ను స్వాధీనం చేసుకున్నారు.

News February 27, 2025

ముగిసిన మహాకుంభ్‌.. మోదీ ట్వీట్!

image

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజుల పాటు జరిగిన మహాకుంభమేళా నిన్నటితో ముగిసింది. ఈక్రమంలో దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘మహాకుంభ్ ముగిసింది. ఐక్యతతో కూడిన గొప్ప ఆచారం ముగిసింది. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఈ మహాకుంభ్‌లో 1.4 బిలియన్ల మంది విశ్వాసం ఏకమైంది. గత 45 రోజులుగా దేశ నలుమూలల నుంచి కోట్ల మంది తరలిరావడాన్ని నేను చూస్తూనే ఉన్నా’ అని తన మదిలో మెదిలిన కొన్ని <>విషయాలను<<>> పంచుకున్నారు.

error: Content is protected !!