News February 27, 2025

జిల్లాలో 96.54 శాతం పోలింగ్ నమోదు

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 984 ఓటర్లుండగా, మొత్తం 96.54 పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ హనుమంతరావు జిల్లా వ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. బ్యాలెట్ బాక్స్‌లను సీజ్ చేసి నల్గొండ జిల్లా కేంద్రానికి తరలించనున్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

Similar News

News February 28, 2025

SEBI చీఫ్‌గా తుహిన్ కాంత పాండే

image

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) చీఫ్‌గా తుహిన్ కాంత పాండేను కేంద్రం నియమించింది. ప్రస్తుతం ఆయన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు. తుహిన్ సెబీ ఛైర్మన్‌‌గా మూడేళ్లు పదవిలో ఉండనున్నారు. ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న మాధవి పురీ బుచ్ పదవీకాలం నిన్నటితో ముగిసింది. కాగా ఇటీవల ఆమె తీవ్ర ఆర్థిక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు.

News February 28, 2025

HYD: కాళోజీ అవార్డు గ్రహీత జయరాజు పదవీ విరమణ

image

బజార్ ఘాట్‌లోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ భవన్‌లో సింగరేణి కార్మికుడు, ప్రముఖ కవి, సినీగేయ రచయిత, కాళోజీ అవార్డు గ్రహీత, తెలంగాణ ఉద్యమకారుడు జయరాజు పదవీ విరమణ జరిగింది. ఈ పదవీ విరమణ సభకు ముఖ్యఅతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అభినందనలు తెలిపారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు శాలువాతో సన్మానించారు.

News February 28, 2025

HYD: కాళోజీ అవార్డు గ్రహీత జయరాజు పదవీ విరమణ

image

బజార్ ఘాట్‌లోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ భవన్‌లో సింగరేణి కార్మికుడు, ప్రముఖ కవి, సినీగేయ రచయిత, కాళోజీ అవార్డు గ్రహీత, తెలంగాణ ఉద్యమకారుడు జయరాజు పదవీ విరమణ జరిగింది. ఈ పదవీ విరమణ సభకు ముఖ్యఅతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అభినందనలు తెలిపారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు శాలువాతో సన్మానించారు.

error: Content is protected !!