News October 30, 2025

ఆదిలాబాద్: అధిక వర్షాలు.. పత్తి రైతులకు సూచనలు

image

మూడు రోజులుగా ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా వ్యవసాయ అధికారులు పత్తి రైతులకు పలు సూచనలు చేశారు. వర్షం పడుతున్నప్పుడు, తగ్గిన వెంటనే తడి పత్తిని తీయరాదని, కేవలం పొడి పత్తిని మాత్రమే తీయాలని కోరారు. తీసిన పత్తిని తడి నేల మీద కాకుండా, పాలిథిన్ షీట్ మీద లేదా పొడి ప్రదేశంలో ఎండబెట్టాలి. తడి పత్తి నిల్వ చేస్తే బూజు పట్టి నష్టపోయే ప్రమాదం ఉందని, ఎండిన పత్తిని మాత్రమే గదిలో నిల్వ చేయాలి.

Similar News

News November 2, 2025

MBNR: అక్టబర్‌లో 21 రెడ్‌హ్యాండెడ్ కేసులు

image

జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ జిల్లాలో అక్టోబర్ నెలలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, నిఘా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మొత్తం 28 ఫిర్యాదులు వచ్చాయి. కౌన్సిలింగ్- 23, రెడ్‌హ్యాండెడ్ కేసులు- 21, FIR- 5, ఈ- పెట్టీ కేసులు- 2, అవగాహన కార్యక్రమాలు- 16, హాట్‌స్పాట్ విజిట్స్- 86, విద్యాసంస్థల్లో ర్యాగింగ్, ఇవ్టీజింగ్, పోక్సో, SM, సెల్ఫ్ డిఫెన్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

News November 2, 2025

MBNR: రగ్బీ పోటీలు.. రేపే SELECTIONS

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎస్జీఎఫ్ అండర్- 17 విభాగంలో రగ్బీ ఎంపికలు ఉంటాయని జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని స్టేడియం గ్రౌండ్‌‌లో రేపు అండర్- 17 విభాగంలో బాలబాలికల రగ్బీ ఎంపికలు ఉంటాయని, ఉదయం 9 గంటలలోపు రిపోర్ట్ చేయాలని, ఆసక్తిగల క్రీడాకారులు స్కూల్ ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలతో హాజరుకావాలని ఆమె సూచించారు.

News November 2, 2025

సిద్దిపేట: కొట్టి దోచుకెళ్లాడు.. పోలీసులకు చిక్కాడు

image

సిద్దిపేటలో దోపిడీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పాత బస్‌స్టాండ్‌ వద్ద ధర్మారం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ను అబ్దుల్ బెదిరించి, కొట్టి, అతని వద్ద నుంచి మొబైల్ ఫోన్, రూ. 1,500 నగదు దోచుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలించి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.