News October 30, 2025

మంచిర్యాల: బైక్ కొనివ్వలేదని యువకుడి సూసైడ్

image

బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా దేవాపూర్‌లో జరిగింది. ASF జిల్లా సుద్దాపూర్‌ వాసి గంగుబాయి దేవాపూర్‌కు వలస వచ్చారు. ఆమె కొడుకు సాయి(20) మెకానిక్ షాపులో పనిచేస్తున్నాడు. బైక్ కోసం తల్లిని వేధించగా ఆమె డబ్బు లేదనడంతో మనస్తాపం చెంది బుధవారం ఉదయం ఇంట్లో ఉరేసుకున్నాడు. గతంలోనూ సాయి ఆత్మహత్యాయత్నం చేశాడు. SI గంగారాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 2, 2025

HYD: తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీ ఏర్పాటు

image

తెలంగాణ జాగృతి బలోపేతంపై కవిత ఫోకస్ పెట్టారు. తాజాగా టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఫెడరేషన్ నూతన కమిటీ అధ్యక్షుడిగా మోరం వీరభద్రరావు, ఉపాధ్యక్షుడిగా బుర్ర రమేశ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా జాడి శ్రీనివాస్, కోశాధికారిగా ఘనపురం దేవేందర్‌ను నియమించినట్లు ఆమె తెలిపారు. వెంటనే వీరి నియామకాలు అమల్లోకి వస్తాయని కవిత పేర్కొన్నారు.

News November 2, 2025

రైల్‌టెల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>రైల్‌టెల్<<>> కార్పొరేషన్ లిమిటెడ్‌ 4 పోస్టులను భర్తీ చేయనుంది. సర్వర్ ఎక్స్‌పర్ట్, స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీటెక్, BE, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 12న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://www.railtel.in/

News November 2, 2025

HYD: తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీ ఏర్పాటు

image

తెలంగాణ జాగృతి బలోపేతంపై కవిత ఫోకస్ పెట్టారు. తాజాగా టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఫెడరేషన్ నూతన కమిటీ అధ్యక్షుడిగా మోరం వీరభద్రరావు, ఉపాధ్యక్షుడిగా బుర్ర రమేశ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా జాడి శ్రీనివాస్, కోశాధికారిగా ఘనపురం దేవేందర్‌ను నియమించినట్లు ఆమె తెలిపారు. వెంటనే వీరి నియామకాలు అమల్లోకి వస్తాయని కవిత పేర్కొన్నారు.