News November 1, 2025
గంజాయి కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష: SP

గంజాయి రవాణా కేసులో ఓ వ్యక్తికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ చోడవరం అదనపు జిల్లా సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. 2021 సెప్టెంబర్ 21న 620 కిలోల గంజాయి రవాణా చేస్తుండగా అనంతగిరిలో మధ్యప్రదేశ్కు చెందిన రణసింగ్ను పట్టుకున్నట్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయగా నేరం రుజువైందన్నారు.
Similar News
News November 2, 2025
వరంగల్: హరీష్ రావును పరామర్శించిన కొండా మురళీ

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు ఇటీవల మృతి చెందారు. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావును మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సత్యనారాయణరావు చిత్రపటానికి కొండా మురళీ పూలమాల వేసి నివాళులర్పించారు.
News November 2, 2025
రేపు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News November 2, 2025
VKB: ‘ప్రజావాణిని పట్టించుకోని అధికారులు!

ప్రతి మండలాలలో సోమవారం నిర్వహించే ప్రజావాణిని పలు శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. జిల్లాలోని ధారూర్, పెద్దేముల్, యాలాల, బొంరాస్పేట్తో పాటు పలు మండలాలల్లో అధికారులు ప్రజావాణికి హాజరుకావడం లేదు. కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాలు బేఖాతర్ చేస్తున్నారు. సక్రమంగా మండలాలు ప్రజావాణి జరిగితే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే ప్రసక్తి ఉండదని గ్రామీణ ప్రజలు తెలుపుతున్నారు.


