News November 1, 2025

ADB: విశ్వసనీయతకు పట్టం.. ఎట్టకేలకు పదవి

image

ఉమ్మడి ADB జిల్లాకు ఎట్టకేలకు మరో క్యాబినెట్ హోదా దక్కింది. గతంలో మంత్రి పదవికి వివేక్, ప్రేమ్ సాగర్ రావు ఇద్దరు పోటీగా ఉండగా చెన్నూరు MLAకే మినిస్ట్రీని కట్టబెట్టారు. ఎందరో పార్టీని వీడిన కాంగ్రెస్‌ని నమ్ముకొని ఉన్న ప్రేమ్ సాగర్ రావును పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్​గా నియమించడంతో ఆయనకు సముచితస్థానం దక్కిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాగా ఇది బుజ్జగింపుల్లో భాగమని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.

Similar News

News November 2, 2025

వరంగల్: హరీష్ రావును పరామర్శించిన కొండా మురళీ

image

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు ఇటీవల మృతి చెందారు. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావును మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సత్యనారాయణరావు చిత్రపటానికి కొండా మురళీ పూలమాల వేసి నివాళులర్పించారు.

News November 2, 2025

రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

News November 2, 2025

VKB: ‘ప్రజావాణిని పట్టించుకోని అధికారులు!

image

ప్రతి మండలాలలో సోమవారం నిర్వహించే ప్రజావాణిని పలు శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. జిల్లాలోని ధారూర్, పెద్దేముల్, యాలాల, బొంరాస్‌పేట్‌తో పాటు పలు మండలాలల్లో అధికారులు ప్రజావాణికి హాజరుకావడం లేదు. కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాలు బేఖాతర్ చేస్తున్నారు. సక్రమంగా మండలాలు ప్రజావాణి జరిగితే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే ప్రసక్తి ఉండదని గ్రామీణ ప్రజలు తెలుపుతున్నారు.