News November 1, 2025
చిత్తూరు: 5 కేసుల్లో 9 మందికి ఉరి శిక్ష…!

చిత్తూరు కోర్టులో మొత్తం 5 ఉరి శిక్షలు పడ్డాయి. తాజాగా కటారి కేసులో ఐదుగురికి, 1988లో ఇద్దరిని హత్య చేసిన కేసులో ఒకరికి, 1992 హత్య కేసులో మరొకరికి శిక్ష పడింది. 2020లో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో ఒకరికి, 2023లో మహిళ, ఆమె తల్లిని చంపిన కేసులో విధించారు.
Similar News
News November 2, 2025
గొలగముడి: లడ్డూ కౌంటర్ 10 గంటలకు ముందే క్లోజ్

వెంకటాచలం మండలం గొలగముడి వెంకయ్య స్వామి గుడికి జిల్లాలోనే మంచి గుర్తింపు ఉంది. ఇక్కడకు ఒక్క శనివారమే సుమారు 10 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. కానీ అక్కడ భక్తులు ఎంతో భక్తితో తీసుకొనే లడ్డూ ప్రసాదం అందరికి అందడం లేదు. కనీసం రాత్రి 10 గంటలు కాకముందే కౌంటర్ మూసేశారు. దీంతో భక్తులు ప్రసాదం తీసుకోకుండానే నిరాశ చెందుతున్నారు. పలుమార్లు ఇలానే జరుగుతుందని భక్తులు వాపోతున్నారు.
News November 2, 2025
నాకు ప్రాణ భయం.. భద్రత పెంచండి: తేజ్ ప్రతాప్

బిహార్ ఎన్నికల వేళ లాలూ పెద్ద కుమారుడు, JJD చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ శత్రుత్వంతో తనపై హత్యాయత్నం జరిగే అవకాశం ఉందన్నారు. తనకు ప్రాణభయం ఉందని, భద్రత మరింత పెంచాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరారు. ఇటీవల దుండగుల కాల్పుల్లో జన్సురాజ్ కార్యకర్త మరణించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కుటుంబ విభేదాల నేపథ్యంలో తేజ్ ప్రతాప్ను RJD నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.
News November 2, 2025
అచ్చంపేట: బండపై 1000 ఏళ్లనాటి పాదాలు, శివలింగం

అచ్చంపేట పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండనాగుల గ్రామ శివారులో ఉన్న శివాలయం ఎదుట ఉన్న బండపై 1000 క్రితం నాటి పాదాలు, శివలింగాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పురావస్తు పరిశోధకులు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ శివ నాగిరెడ్డి అన్నారు. దేవాలయం కమిటీ అధ్యక్షుడు అంబటి లింగయ్య ఇచ్చిన సమాచారం మేరకు ఆదివారం శివాలయం వద్దకు చేరుకొని బండపై చెక్కి ఉన్న వాటిని పరిశీలించారు.


