News November 1, 2025

జగిత్యాల: ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్..!

image

జగిత్యాలలోని బాలికల జూనియర్ కళాశాలలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన కరీంనగర్ అర్బన్ బ్యాంకు పాలక మండలి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లాలోని 2,105 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా, పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనుంది. ఇదిలా ఉండగా షేర్ హోల్డర్ల లిస్టులో తమ పేరు ఉందని, అయినప్పటికీ ఓటర్ లిస్టులో పేరు రాలేదని పలువురు ఆరోపిస్తున్నారు.

Similar News

News November 2, 2025

వరంగల్: రేపటి ప్రజావాణి రద్దు: కలెక్టర్

image

వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని పరిపాలనా కారణాల వల్ల రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టాల వివరాల సేకరణలో అధికారులు నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రజలు కలెక్టరేట్‌కు రావద్దని కలెక్టర్ సూచించారు.

News November 2, 2025

కార్తీక పౌర్ణమి ఏరోజు జరపాలంటే?

image

ఈ ఏడాది కార్తీక పౌర్ణమి NOV 5న జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. నదీ స్నానాలకు 4:52 AM – 5:44 AM అనుకూలంగా ఉందన్నారు. పూజా కార్యక్రమాలను 7:58 AM – 9:00 AM జరపాలని సూచించారు. దీపారాధనకు సా.5:15 గంటల నుంచి రా.7:05 వరకు ఉత్తమమన్నారు. పౌర్ణమి రోజున 365 వత్తుల దీపం పెట్టి, శివకేశవులను పూజించి, ఉపవాసం ఉంటే.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నమ్మకం.☞ కార్తీక పౌర్ణమి విశేషాలు, పూజ నియమాల కోసం <<-se_10013>>భక్తి<<>>.

News November 2, 2025

అవార్డును అభిమానులకు అంకితమిస్తున్నా: అల్లు అర్జున్

image

పుష్ప సినిమాలో నటనకు గాను ప్రతిష్ఠాత్మక అవార్డుకు అల్లు అర్జున్ ఎంపికయ్యారు. ‘మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారానికి ఆయన ఎంపికైనట్లు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ అవార్డ్స్-2025 ప్రకటించింది. దీనిపై స్పందించిన అల్లు అర్జున్ తన అభిమానులకు అవార్డును అంకితం ఇస్తున్నానని ట్వీట్ చేశారు. ప్రేక్షకుల నిరంతర ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు.