News November 1, 2025
HYD: చంద్రబాబు ఫొటోతో ప్రచారం.. కాంగ్రెస్ VS BJP

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో చంద్రబాబు ఫొటోలు, TDP జెండాలు దర్శనమిస్తున్నాయి. ఇటీవల BJP ర్యాలీలో TDP జెండాలు కనిపించగా తాజాగా కాంగ్రెస్ ర్యాలీలో చంద్రబాబు ఫొటో కనిపించింది. అయితే కాంగ్రెస్ నేతలపై సరూర్నగర్ BJP కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ NDA మిత్రపక్ష నేత, AP CM చంద్రబాబు ఫొటోను కాంగ్రెసోళ్లు వినియోగించడం సిగ్గు చేటన్నారు.ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
Similar News
News November 2, 2025
NLG: కాగితాలపైనే అంచనా లెక్కలు… రైతులందరికీ సాయమందేనా?

ఆకాల వర్షాలతో రైతులు పంటలు నష్టపోతున్నారు. పంటల బీమా అమలుకు నోచుకోక ప్రభుత్వం అందించే సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాల్సిన అధికారులు కాగితాలపై అంచనా లెక్కనే వేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో సాగు విస్తీర్ణం డిజిటల్ క్రాప్ సర్వే మొక్కుబడిగానే నిర్వహించినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. సాగు విస్తీర్ణం నష్టం నమోదులోనూ అదే తీరు కనిపిస్తుందన్నారు.
News November 2, 2025
వరంగల్: కబ్జాలతో కష్టాలు

వరంగల్ నగరాన్ని వరద ముంచెత్తింది. దీనికి ప్రధాన కారణం వర్షం కాదని, నాలాలు, కాలువలు, చెరువులపై జరుగుతున్న ఆక్రమణలేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు నగరానికి అందాన్ని తెచ్చిన 170కి పైగా చెరువులు, కుంటలు ఇప్పుడు అర్ధభాగం వరకు మాయం అయ్యాయని, మురికి కాలువలపై కొందరు అక్రమార్కులు భవనాలు, షాపులు నిర్మించుకుని ప్రజా భద్రతను సవాల్ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
News November 2, 2025
వరంగల్: హైదరాబాద్ బయలుదేరిన బీసీ సంఘం నేతలు

హైదరాబాద్లో జరగనున్న బీసీ జేఏసీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడానికి వరంగల్ జిల్లాలోని బీసీ జేఏసీ, బీసీ సంక్షేమ సంఘం నాయకులు బయలుదేరారు. వరంగల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, బీసీ జేఏసీ ఛైర్మన్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ.. బీసీ హక్కుల సాధన కోసం రాష్ట్ర స్థాయిలో ఐక్యత అత్యవసరమన్నారు. ఈ సమావేశం చారిత్రాత్మకంగా నిలవబోతుందని పేర్కొన్నారు.


