News November 1, 2025
HYD: KCR పదేళ్లు దోచుకున్నాడు: జేఏసీ

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఛైర్మన్ సుల్తాన్ యాదగిరి పిలుపునిచ్చారు. శనివారం HYD బషీర్బాగ్లో జాక్ ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్రంలోని BJP ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందన్నారు. KCR 10ఏళ్లలో దోపిడీ, నిరంకుశ పాలనను సాగించారని, BRSను ఓడించాలని ప్రజలను కోరారు.
Similar News
News November 2, 2025
MBNR: అక్టబర్లో 21 రెడ్హ్యాండెడ్ కేసులు

జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు మహబూబ్నగర్ జిల్లాలో అక్టోబర్ నెలలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, నిఘా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మొత్తం 28 ఫిర్యాదులు వచ్చాయి. కౌన్సిలింగ్- 23, రెడ్హ్యాండెడ్ కేసులు- 21, FIR- 5, ఈ- పెట్టీ కేసులు- 2, అవగాహన కార్యక్రమాలు- 16, హాట్స్పాట్ విజిట్స్- 86, విద్యాసంస్థల్లో ర్యాగింగ్, ఇవ్టీజింగ్, పోక్సో, SM, సెల్ఫ్ డిఫెన్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
News November 2, 2025
MBNR: రగ్బీ పోటీలు.. రేపే SELECTIONS

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎస్జీఎఫ్ అండర్- 17 విభాగంలో రగ్బీ ఎంపికలు ఉంటాయని జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి తెలిపారు. మహబూబ్నగర్లోని స్టేడియం గ్రౌండ్లో రేపు అండర్- 17 విభాగంలో బాలబాలికల రగ్బీ ఎంపికలు ఉంటాయని, ఉదయం 9 గంటలలోపు రిపోర్ట్ చేయాలని, ఆసక్తిగల క్రీడాకారులు స్కూల్ ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలతో హాజరుకావాలని ఆమె సూచించారు.
News November 2, 2025
సిద్దిపేట: కొట్టి దోచుకెళ్లాడు.. పోలీసులకు చిక్కాడు

సిద్దిపేటలో దోపిడీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పాత బస్స్టాండ్ వద్ద ధర్మారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ను అబ్దుల్ బెదిరించి, కొట్టి, అతని వద్ద నుంచి మొబైల్ ఫోన్, రూ. 1,500 నగదు దోచుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలించి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.


