News November 1, 2025

ప్రైవేటు ఆలయాల భద్రత, నిర్వహణపై ప్రశ్నలు..

image

కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనతో ప్రైవేటు ఆలయాల నిర్వహణ తీరుపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. భక్తి, గుర్తింపు తదితర కారణాలతో ఇటీవల కొందరు భారీ స్థాయిలో గుళ్లు కడుతున్నారు. భారీ, ఆకట్టుకునే నిర్మాణం, విగ్రహాలు, లైటింగ్ ఎఫెక్ట్స్‌పై సోషల్ మీడియా ప్రచారంతో ప్రజలు విపరీతంగా వెళ్తున్నారు. ప్రైవేటు నిర్వహణలోని ఆ ఆలయాల్లో ఇలాంటి దుర్ఘటన జరిగితే నష్ట నివారణ చర్యలున్నాయా? లేదా? ప్రభుత్వాలు దర్యాప్తు చేయాలి.

Similar News

News November 2, 2025

నో రిప్లై.. రేపటి నుంచి కాలేజీలు బంద్

image

TG: ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రేపటి నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ చేపట్టాలని యాజమాన్యాలు తాజాగా మరోసారి చర్చించి నిర్ణయం తీసుకున్నాయి. రూ.900 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చి రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. ఈ నెల 4న మంత్రులకు రిప్రజెంటేషన్ ఇస్తామని, 6న లక్ష మంది ప్రైవేటు కాలేజీల సిబ్బందితో సభ జరుపుతామని, 10న పది లక్షల మంది విద్యార్థులతో లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని చెప్పారు.

News November 2, 2025

రేర్ ఎర్త్ మాగ్నెట్స్.. చైనాకు చెక్ పెట్టనున్న భారత్

image

రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఉత్పత్తిలో 90% వాటా కలిగిన చైనాకు సవాల్ విసిరేందుకు భారత్ సిద్ధమైంది. దేశీయంగా ఈ రంగంలో ప్రోత్సాహకాలను $290M నుంచి $788Mకు పెంచనున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, పునరుత్పాదక, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ రంగాలకు ఈ రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఎంతో కీలకం. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది.

News November 2, 2025

తుఫానుతో నష్టపోయిన నేతన్నలకు రూ.5వేలు: మంత్రి

image

AP: మొంథా తుఫానుతో నష్టపోయిన చేనేత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి సవిత తెలిపారు. నీటమునిగి తడిచిపోయిన నూలు, రంగులు, రసాయనాలకు రూ.5 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తున్నామని చెప్పారు. వర్షాలతో ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు 50 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, కేజీ పంచదార ఇస్తున్నట్లు పేర్కొన్నారు.