News November 1, 2025
ఎల్లుండి నుంచి మెట్రో రైలు సమయాల్లో మార్పు

TG: మెట్రో రైలు సమయాల్లో మార్పు చోటు చేసుకోనుంది. తొలి ట్రైన్ ఉదయం 6 గంటలకు, చివరి ట్రైన్ రాత్రి 11 గంటలకు అన్ని టర్మినల్ స్టేషన్ల నుంచి మొదలవుతాయని L&T హైదరాబాద్ మెట్రో పేర్కొంది. ఎల్లుండి నుంచి కొత్త టైమింగ్స్ అందుబాటులోకి వస్తాయని ప్రకటనలో తెలిపింది. అంతకుముందు తొలి ట్రైన్ ఉదయం 6గంటలకు, చివరి ట్రైన్ రాత్రి 11:45గంటలకు మొదలైన సంగతి తెలిసిందే.
Similar News
News November 2, 2025
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, సిద్దిపేట, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, యాదాద్రి, నల్గొండలో వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపారు. HYDలో సాయంత్రం నుంచి వాన పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురు జల్లులు పడే ఆస్కారమున్నట్లు వివరించారు.
News November 2, 2025
రైల్టెల్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News November 2, 2025
వీళ్లు తీర్థయాత్రలు వెళ్లాల్సిన పని లేదు

కార్తీక వ్రత మహత్యం చాలా గొప్పదని పండితులు చెబుతున్నారు. ‘భూమ్మీదున్న పుణ్యక్షేత్రాలన్నీ కార్తీక వ్రతస్థుని శరీరమందే ఉంటాయి. ఇంద్రాదులు కూడా ఈ వ్రతస్థులను సేవిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించిన చోటు నుంచి గ్రహ, భూత పిశాచ గణాలు పారిపోతాయి. నిష్ఠగా కార్తీక వ్రతం చేసే వారి పుణ్యాన్ని చెప్పడం ఆ బ్రహ్మకే సాధ్యం కాదు. ఈ కార్తీక వ్రతాన్ని విడువక ఆచరించేవారు తీర్థయాత్రల అవసరమే లేదు’ అని అంటున్నారు. <<-se>>#Karthikam<<>>


