News November 1, 2025

NRPT: అరుణాచల క్షేత్రానికి ప్రత్యేక బస్ సర్వీసు

image

పౌర్ణమి సందర్భంగా నారాయణపేట ఆర్టీసీ డిపో నుంచి అరుణాచల క్షేత్రానికి ప్రత్యేక లగ్జరీ బస్ సర్వీసు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. ఈ నెల 3న సాయంత్రం 6 గంటలకు బస్సు బయలుదేరి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత అరుణాచలం చేరుకుంటుంది. గిరి ప్రదక్షిణ, దర్శనం అనంతరం 5న తిరుగు ప్రయాణం అవుతుందని; పెద్దలకు రూ. 4వేలు, పిల్లలకు రూ.2,800 ఛార్జీ ఉంటుందని ఆమె చెప్పారు.

Similar News

News November 2, 2025

గొలగముడి: లడ్డూ కౌంటర్ 10 గంటలకు ముందే క్లోజ్

image

వెంకటాచలం మండలం గొలగముడి వెంకయ్య స్వామి గుడికి జిల్లాలోనే మంచి గుర్తింపు ఉంది. ఇక్కడకు ఒక్క శనివారమే సుమారు 10 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. కానీ అక్కడ భక్తులు ఎంతో భక్తితో తీసుకొనే లడ్డూ ప్రసాదం అందరికి అందడం లేదు. కనీసం రాత్రి 10 గంటలు కాకముందే కౌంటర్ మూసేశారు. దీంతో భక్తులు ప్రసాదం తీసుకోకుండానే నిరాశ చెందుతున్నారు. పలుమార్లు ఇలానే జరుగుతుందని భక్తులు వాపోతున్నారు.

News November 2, 2025

నాకు ప్రాణ భయం.. భద్రత పెంచండి: తేజ్ ప్రతాప్

image

బిహార్ ఎన్నికల వేళ లాలూ పెద్ద కుమారుడు, JJD చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ శత్రుత్వంతో తనపై హత్యాయత్నం జరిగే అవకాశం ఉందన్నారు. తనకు ప్రాణభయం ఉందని, భద్రత మరింత పెంచాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరారు. ఇటీవల దుండగుల కాల్పుల్లో జన్‌సురాజ్ కార్యకర్త మరణించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కుటుంబ విభేదాల నేపథ్యంలో తేజ్ ప్రతాప్‌ను RJD నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.

News November 2, 2025

అచ్చంపేట: బండపై 1000 ఏళ్లనాటి పాదాలు, శివలింగం

image

అచ్చంపేట పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండనాగుల గ్రామ శివారులో ఉన్న శివాలయం ఎదుట ఉన్న బండపై 1000 క్రితం నాటి పాదాలు, శివలింగాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పురావస్తు పరిశోధకులు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ శివ నాగిరెడ్డి అన్నారు. దేవాలయం కమిటీ అధ్యక్షుడు అంబటి లింగయ్య ఇచ్చిన సమాచారం మేరకు ఆదివారం శివాలయం వద్దకు చేరుకొని బండపై చెక్కి ఉన్న వాటిని పరిశీలించారు.