News November 2, 2025

క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి కొండపల్లి

image

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనలో 9 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మరి కొంతమంది తీవ్ర గాయాలు పాలై పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందుతుందని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Similar News

News November 2, 2025

VZM: రెవెన్యూ అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

విజయనగరం జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న దేవాలయాలు, ఏడాదిలో జరిగే ఉత్సవాల వివరాలు అందివ్వాలని అధికారులకు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కాశీబుగ్గ ఘటన నేపథ్యంలో శనివారం ఆయన స్పందించారు. ఆయా ఆలయాల్లో జరిగే ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల సంఖ్య, గతంలో జరిగిన దుర్ఘటనలు, తదితర అంశాలతో సర్వే చేసి నివేదిక అందించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.

News November 2, 2025

ప్రైవేట్ ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

image

విజయనగరం జిల్లాలోని అన్ని ప్రైవేట్ దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం ఆదేశించారు. కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పండుగలు, జాతరల సమయంలో భద్రతా చర్యలు, బారికేడ్లు, క్యూలైన్ వ్యవస్థలు అమలు చేయాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు.

News November 2, 2025

పర్యాటక ప్రోత్సాహానికి హోమ్ స్టే విధానం: కలెక్టర్

image

పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి, పర్యాటకులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వసతి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం హోమ్ స్టే, బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ విధానాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శనివారం తెలిపారు. హోమ్ స్టేలు ఏర్పాటు చేయాలనుకునే యజమానులు పర్యాటక శాఖ మార్గదర్శకాల ప్రకారం 1 నుంచి 6 గదులు అద్దెకు ఇవ్వవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వారు nidhi.tourism.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.