News November 2, 2025

GWL: ఇసుక క్వారీలపై నివేదిక సిద్ధం చేయాలి: కలెక్టర్

image

జోగులాంబ గద్వాల జిల్లాలోని చిన్న తరహా ఖనిజాలు, ఇసుక క్వారీలపై పూర్తిస్థాయి నివేదిక తయారు చేయాలని కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం తన ఛాంబర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. నీటిపారుదల, భూగర్భ జల, గనులు మరియు భూగర్భ శాఖ, టీఎస్‌ఎండీసీ, అటవీ, రెవెన్యూ విభాగాల అధికారులు ఈ నివేదికలను సిద్ధం చేసి, ఆయా శాఖల కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు.

Similar News

News November 2, 2025

కామారెడ్డిలో రేపు ప్రజావాణి

image

కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అధికారులు ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జిల్లా ప్రజలకు సూచించారు.

News November 2, 2025

సన్నబియ్యంలో కేంద్రం వాటా రూ.42, రాష్ట్రానిది రూ.15: కిషన్ రెడ్డి

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే సన్నబియ్యం రద్దవుతాయని సీఎం రేవంత్ ప్రజలను బెదిరిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి బెదిరింపు రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. సన్నబియ్యం స్కీమ్ కేంద్రానిదని, కేజీకి మోదీ సర్కారు రూ.42 ఇస్తే, రాష్ట్రం వాటా రూ.15 మాత్రమే అని పేర్కొన్నారు.

News November 2, 2025

ప్రేమ వివాహం.. పోలీస్ స్టేషన్‌లో హాజరైన యువతి

image

రామసముద్రం పోలీస్ స్టేషన్‌లో నమోదైన యువతి మిస్సింగ్ కేసులో సస్పెన్స్‌కు తెరపడింది. తిరుమల రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అరవింద్‌తో ప్రేమ వివాహం చేసుకున్న ఆమె స్వయంగా పోలీస్ స్టేషన్‌కు హాజరైనట్లు SI రమేష్ బాబు తెలిపారు. అమ్మాయి మేజర్ కావడంతో MRO సమక్షంలో వీడియో, రాతపూర్వకంగా ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు SI పేర్కొన్నారు.