News November 12, 2025
విజయవాడలో RTC బంపర్ ఆఫర్..!

విజయవాడ నగర ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు అర్ధరాత్రి వరకు చెల్లుబాటు అయ్యే ట్రావెల్ యాజ్ యూ లైక్ (TAYL) టికెట్ ఇకపై తీసుకున్న సమయం నుంచి 24 గంటల వరకు చెల్లుబాటు అవుతుంది. కేవలం రూ.100 చెల్లించి సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎన్నిసార్లయినా ప్రయాణించవచ్చని జిల్లా ప్రజా రవాణా అధికారి దానం తెలిపారు.
Similar News
News November 12, 2025
HYD: టీజీ సెట్-2025 డిసెంబర్ 10 నుంచి ప్రారంభం

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG SET-2025) డిసెంబర్ 10, 11, 12వ తేదీల్లో మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు ఓయూ అధికారులు ప్రకటించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ అర్హత కోసం ఈ పరీక్షను 29 సబ్జెక్టుల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లు డిసెంబర్ 3 నుంచి అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
News November 12, 2025
రాజన్న దర్శనాలు మరోవారమైన కొనసాగించాల్సింది..!

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనాలు ఈరోజు ఉదయం నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజన్నకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం మరో వారంలో పూర్తికానుంది. భక్తులు కార్తీక దీపారాధన చేసుకోవడానికి అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో రాజన్న దర్శనాలు మరో వారం పాటు కొనసాగించాలని భక్తులు కోరుతున్నారు.
News November 12, 2025
ఉగ్రకుట్ర ప్రధాన సూత్రధారి ఇతడే..!

ఫరీదాబాద్ ఉగ్రమూలాల కేసులో ప్రధాన సూత్రధారి ఇటీవల జమ్మూలో అరెస్టైన ఇమామ్ ఇర్ఫాన్ అహ్మదేనని తేలింది. జైషే మహ్మద్ నుంచి ప్రేరణ పొందిన అతడు ఫరీదాబాద్లోని వైద్య విద్యార్థులకు బ్రెయిన్ వాష్ చేశాడు. వారిని పూర్తిగా ఉగ్రవాదం వైపు నడిపించడమే లక్ష్యంగా తరచూ జైషే వీడియోలు చూపించాడు. ఢిల్లీ పేలుడులో అనుమానితుడు డా.ఉమర్, ఇప్పటికే అరెస్టైన డా.ముజమ్మిల్, డా.షాహిన్ ఇతడి కంట్రోల్లోనే ఉన్నట్లు సమాచారం.


