News November 12, 2025
25వ తేదీ వరకు టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం: DEO

పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు ఆన్లైన్ ద్వారా ఈనెల 25వ తేదీ వరకు అవకాశం ఉన్నట్లు DEO డాక్టర్ ఆర్.బాలాజీ రావు తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు www.bse.ap.gov.in వెబ్సైట్లో లాగిన్ నుంచి ఫీజు చెల్లించాలని సూచించారు. పరీక్ష రాసేందుకు తక్కువ వయసు ఉన్న విద్యార్థులు అండర్ ఏజ్ సర్టిఫికెట్ కోసం రూ.300 ఆన్లైన్లో చెల్లించాలన్నారు.
Similar News
News November 12, 2025
HYD ఎయిర్పోర్ట్లో తనిఖీలు.. నెల్లూరు వాసి అరెస్ట్

ఢిల్లీలో పేలుడు నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో CISF అధికారులు అర్ధరాత్రి ముమ్మర తనిఖీలు చేపట్టారు. అబుదాబీ నుంచి HYD వచ్చిన నెల్లూరు వాసి జయరాం సూర్యప్రకాశ్, చెన్నై వాసి మహమ్మద్ జహంగీర్ లగేజీలను చెక్ చేయగా సుమారు రూ.2 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను గుర్తించారు. 8 డ్రోన్లు, 65 ఐఫోన్లు, 50 ఐవాచ్లు, 4 వీడియో గేమ్స్ పరికరాలు, డ్రోన్స్ను సీజ్ చేసి, ఇద్దరిని అరెస్ట్ చేశారు.
News November 12, 2025
కల్తీ నెయ్యి కేసు.. ధర్మారెడ్డి చెప్పింది ఇదేనా.?

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో TTD మాజీ ఈవో ధర్మారెడ్డిని మంగళవారం సిట్ ప్రశ్నించింది. ఇందులో భాగంగా కల్తీ నెయ్యి వ్యవహారంలో తన ప్రమేయం లేదని ధర్మారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. <<18262552>>హైకమాండ్<<>>(బోర్డ్/ పొలిటికల్) నిర్ణయాల మేరకే టెండర్లకు ఆమోదం తెలిపామని, రూల్స్కు అనుగుణంగా బోర్డులో నిర్ణయాలు తీసుకున్నామని ఆయన చెప్పినట్లు సమాచారం.
News November 12, 2025
రేపు జిల్లా వ్యాప్తంగా 19,678 గృహ ప్రవేశాలు

జిల్లాలో PMAY కింద పూర్తి చేసిన 19,678 గృహాల ప్రవేశం బుధవారం జరగనుంది. అధికారులు ఇందుకు సంబంధించి ఏర్పాట్లను పూర్తిచేశారు.అదే విధంగా PMAY కింద 2.0 పథకం కింద మరో 2,838 మందికి గృహాలను మంజూరు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఈనెల 30వ తేదీ వరకు ఆవాస్ ప్లస్-2024 సర్వేలో భాగంగా గ్రామీణ యాప్ ద్వారా లబ్ధిదారుల నమోదు జరుగనుంది.


