News November 12, 2025
2.50 కేజీల గోల్డ్ చోరీ.. దొంగలు తిరుపతికి పరార్?

చెన్నై కొరకు పేటై ప్రాంతంలో 2.50 కిలోల బంగారం దొంగతనం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పేటై ఎస్ఐ ఇద్దరు నిందితులు బాపన్ రాయ్, నారాయన్ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో వారు నాగలాపురం మీదగా తిరుపతికి వచ్చినట్లు తెలిపారు. అక్కడి పోలీసుల సమాచారంతో తిరుపతి పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానితులు కనిపిస్తే తమకు సమాచారం(8099999977) ఇవ్వాలని కోరారు.
Similar News
News November 12, 2025
దర్శనాల నిలిపివేత పై మరికాసేపట్లో అధికారిక ప్రకటన

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులకు దర్శనం నిలిపివేయడంపై ఆలయ అధికారులు మరికాసేపట్లో అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నారు. అభివృద్ధి పనుల కోసం నెల రోజుల కిందనే దర్శనాలు నిలిపివేయాలని నిర్ణయించినప్పటికీ హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు తీవ్ర వ్యతిరేకత తెలపడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఈ క్రమంలో ముందస్తు సమాచారం లేకుండా బుధవారం తెల్లవారుజాము నుండి దర్శనాలు నిలిపివేశారు.
News November 12, 2025
HYD: మీర్ ఆలం ట్యాంక్పై ఐకానిక్ కేబుల్ వంతెనకు CM గ్రీన్ సిగ్నల్

మూసీ పునరుజ్జీవంలో భాగంగా శాస్త్రిపురం వద్ద మీర్ ఆలం ట్యాంక్పై చింతల్మెట్తో అనుసంధానమయ్యే 2.5 కి.మీ పొడవైన కేబుల్-స్టేడ్ వంతెన నిర్మాణానికి CM రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. రూ.319 కోట్ల వ్యయంతో KNR కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును EPC మోడల్లో నిర్మించనుంది. వంతెన డిజైన్ దుర్గం చెరువు వంతెన కంటే అద్భుతంగా ఉండనుంది. నీటి వనరుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయనుంది.
News November 12, 2025
HYD: మీర్ ఆలం ట్యాంక్పై ఐకానిక్ కేబుల్ వంతెనకు CM గ్రీన్ సిగ్నల్

మూసీ పునరుజ్జీవంలో భాగంగా శాస్త్రిపురం వద్ద మీర్ ఆలం ట్యాంక్పై చింతల్మెట్తో అనుసంధానమయ్యే 2.5 కి.మీ పొడవైన కేబుల్-స్టేడ్ వంతెన నిర్మాణానికి CM రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. రూ.319 కోట్ల వ్యయంతో KNR కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును EPC మోడల్లో నిర్మించనుంది. వంతెన డిజైన్ దుర్గం చెరువు వంతెన కంటే అద్భుతంగా ఉండనుంది. నీటి వనరుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయనుంది.


