News November 12, 2025

ఆస్పత్రి నుంచి వస్తుండగా యాక్సిడెంట్.. తల్లీకొడుకు మృతి

image

కోయిలకొండ మండలంలోని తమ్మాయిపల్లి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముత్యాలమ్మ, ఆమె కుమారుడు బలరాం మృతి చెందారు. వీరన్నపల్లికి చెందిన వీరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించుకుని తిరిగి వస్తుండగా కారు ఢీకొట్టింది. వారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 12, 2025

దర్శనాల నిలిపివేత పై మరికాసేపట్లో అధికారిక ప్రకటన

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులకు దర్శనం నిలిపివేయడంపై ఆలయ అధికారులు మరికాసేపట్లో అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నారు. అభివృద్ధి పనుల కోసం నెల రోజుల కిందనే దర్శనాలు నిలిపివేయాలని నిర్ణయించినప్పటికీ హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు తీవ్ర వ్యతిరేకత తెలపడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఈ క్రమంలో ముందస్తు సమాచారం లేకుండా బుధవారం తెల్లవారుజాము నుండి దర్శనాలు నిలిపివేశారు.

News November 12, 2025

HYD: మీర్ ఆలం ట్యాంక్‌పై ఐకానిక్ కేబుల్ వంతెనకు CM గ్రీన్ సిగ్నల్

image

మూసీ పునరుజ్జీవంలో భాగంగా శాస్త్రిపురం వద్ద మీర్‌ ఆలం‌ ట్యాంక్‌పై చింతల్‌మెట్‌తో అనుసంధానమయ్యే 2.5 కి.మీ పొడవైన కేబుల్-స్టేడ్ వంతెన నిర్మాణానికి CM రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. రూ.319 కోట్ల వ్యయంతో KNR కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును EPC మోడల్‌లో నిర్మించనుంది. వంతెన డిజైన్‌ దుర్గం చెరువు వంతెన కంటే అద్భుతంగా ఉండనుంది. నీటి వనరుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయనుంది.

News November 12, 2025

HYD: మీర్ ఆలం ట్యాంక్‌పై ఐకానిక్ కేబుల్ వంతెనకు CM గ్రీన్ సిగ్నల్

image

మూసీ పునరుజ్జీవంలో భాగంగా శాస్త్రిపురం వద్ద మీర్‌ ఆలం‌ ట్యాంక్‌పై చింతల్‌మెట్‌తో అనుసంధానమయ్యే 2.5 కి.మీ పొడవైన కేబుల్-స్టేడ్ వంతెన నిర్మాణానికి CM రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. రూ.319 కోట్ల వ్యయంతో KNR కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును EPC మోడల్‌లో నిర్మించనుంది. వంతెన డిజైన్‌ దుర్గం చెరువు వంతెన కంటే అద్భుతంగా ఉండనుంది. నీటి వనరుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయనుంది.