News November 12, 2025
పాఠశాలల తనిఖీలకు 7 బృందాలు: అడిషనల్ కలెక్టర్

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల నిరంతరం తనిఖీలు చేసేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు హనుమకొండ అడిషనల్ కలెక్టర్, డీఈవో వెంకట్ రెడ్డి వెల్లడించారు. హై స్కూళ్ల తనిఖీలకు మూడు, ప్రైమరీ స్కూళ్లకు మూడు, అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు ఒకటి చొప్పున మొత్తం 7 జిల్లా స్థాయి బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాలు స్కూళ్లను తనిఖీలు చేస్తూ అక్కడున్న అన్ని పరిస్థితులను ఉన్నతాధికారులకు నివేదిస్తారన్నారు.
Similar News
News November 12, 2025
దర్శనాల నిలిపివేత పై మరికాసేపట్లో అధికారిక ప్రకటన

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులకు దర్శనం నిలిపివేయడంపై ఆలయ అధికారులు మరికాసేపట్లో అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నారు. అభివృద్ధి పనుల కోసం నెల రోజుల కిందనే దర్శనాలు నిలిపివేయాలని నిర్ణయించినప్పటికీ హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు తీవ్ర వ్యతిరేకత తెలపడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఈ క్రమంలో ముందస్తు సమాచారం లేకుండా బుధవారం తెల్లవారుజాము నుండి దర్శనాలు నిలిపివేశారు.
News November 12, 2025
HYD: మీర్ ఆలం ట్యాంక్పై ఐకానిక్ కేబుల్ వంతెనకు CM గ్రీన్ సిగ్నల్

మూసీ పునరుజ్జీవంలో భాగంగా శాస్త్రిపురం వద్ద మీర్ ఆలం ట్యాంక్పై చింతల్మెట్తో అనుసంధానమయ్యే 2.5 కి.మీ పొడవైన కేబుల్-స్టేడ్ వంతెన నిర్మాణానికి CM రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. రూ.319 కోట్ల వ్యయంతో KNR కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును EPC మోడల్లో నిర్మించనుంది. వంతెన డిజైన్ దుర్గం చెరువు వంతెన కంటే అద్భుతంగా ఉండనుంది. నీటి వనరుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయనుంది.
News November 12, 2025
HYD: మీర్ ఆలం ట్యాంక్పై ఐకానిక్ కేబుల్ వంతెనకు CM గ్రీన్ సిగ్నల్

మూసీ పునరుజ్జీవంలో భాగంగా శాస్త్రిపురం వద్ద మీర్ ఆలం ట్యాంక్పై చింతల్మెట్తో అనుసంధానమయ్యే 2.5 కి.మీ పొడవైన కేబుల్-స్టేడ్ వంతెన నిర్మాణానికి CM రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. రూ.319 కోట్ల వ్యయంతో KNR కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును EPC మోడల్లో నిర్మించనుంది. వంతెన డిజైన్ దుర్గం చెరువు వంతెన కంటే అద్భుతంగా ఉండనుంది. నీటి వనరుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయనుంది.


