News November 12, 2025
టెన్త్ పరీక్ష ఫీజు రూ.50

వచ్చేఏడాది జరగనున్న టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు తేదీని ఇన్ఛార్జ్ DEO పాటిల్ మల్లారెడ్డి వెల్లడించారు. రేపటి నుంచి ఈనెల 25 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ.50 రుసుముతో డిసెంబర్ 3వ తేదీ వరకు, రూ.200తో 10వ తేదీ వరకు, రూ.500తో 15వ తేదీ వరకు చెల్లించవచ్చని తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125, ఒకసారి ఫెయిలైన వారు 3 కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 చెల్లించాలన్నారు.
Similar News
News November 12, 2025
దర్శనాల నిలిపివేత పై మరికాసేపట్లో అధికారిక ప్రకటన

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులకు దర్శనం నిలిపివేయడంపై ఆలయ అధికారులు మరికాసేపట్లో అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నారు. అభివృద్ధి పనుల కోసం నెల రోజుల కిందనే దర్శనాలు నిలిపివేయాలని నిర్ణయించినప్పటికీ హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు తీవ్ర వ్యతిరేకత తెలపడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఈ క్రమంలో ముందస్తు సమాచారం లేకుండా బుధవారం తెల్లవారుజాము నుండి దర్శనాలు నిలిపివేశారు.
News November 12, 2025
HYD: మీర్ ఆలం ట్యాంక్పై ఐకానిక్ కేబుల్ వంతెనకు CM గ్రీన్ సిగ్నల్

మూసీ పునరుజ్జీవంలో భాగంగా శాస్త్రిపురం వద్ద మీర్ ఆలం ట్యాంక్పై చింతల్మెట్తో అనుసంధానమయ్యే 2.5 కి.మీ పొడవైన కేబుల్-స్టేడ్ వంతెన నిర్మాణానికి CM రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. రూ.319 కోట్ల వ్యయంతో KNR కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును EPC మోడల్లో నిర్మించనుంది. వంతెన డిజైన్ దుర్గం చెరువు వంతెన కంటే అద్భుతంగా ఉండనుంది. నీటి వనరుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయనుంది.
News November 12, 2025
HYD: మీర్ ఆలం ట్యాంక్పై ఐకానిక్ కేబుల్ వంతెనకు CM గ్రీన్ సిగ్నల్

మూసీ పునరుజ్జీవంలో భాగంగా శాస్త్రిపురం వద్ద మీర్ ఆలం ట్యాంక్పై చింతల్మెట్తో అనుసంధానమయ్యే 2.5 కి.మీ పొడవైన కేబుల్-స్టేడ్ వంతెన నిర్మాణానికి CM రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. రూ.319 కోట్ల వ్యయంతో KNR కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును EPC మోడల్లో నిర్మించనుంది. వంతెన డిజైన్ దుర్గం చెరువు వంతెన కంటే అద్భుతంగా ఉండనుంది. నీటి వనరుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయనుంది.


