News November 12, 2025
NZB: ఈ నెల 20 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

TU పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో B.A/B.Com/B.Sc/BBA/BCA 1,3,5 రెగ్యులర్, 2,4,6 బ్యాక్ లాగ్ (2021-2025) సెమిస్టర్ల డిగ్రీ పరీక్షలు ఈనెల 20 నుంచి నిర్వహించనున్నట్లు COE ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం డిగ్రీ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. ఈనెల 20 నుంచి డిసెంబర్ 10 వరకు ఉదయం 9గం. నుంచి 12గం. వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలన్నారు.
Similar News
News November 12, 2025
HYD: ఒక్క నెలలో రూ.13 కోట్లు తగ్గిన ఎకరం!

రియల్ ఎస్టేట్ రంగం ఇటీవల కాలంలో మందగమనంలోకి వెళ్లిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. తాజాగా టీజీఐఐసీ నిర్వహించిన రాయదుర్గ్ పాన్మక్తా భూముల వేలంలో ఎకరాకు రూ.164 కోట్లు మాత్రమే పలకడం వివాదాస్పదంగా మారింది. గత నెలలో ఇదే ప్రాంతంలో ఎకరాకు రూ.177 కోట్లు వచ్చినప్పటికీ, ఒక్క నెలలోనే రూ.13 కోట్ల తేడా రావడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ధరల వ్యత్యాసం వెనుక రాజకీయ ప్రభావం ఉందా? అనే చర్చ నడుస్తోంది.
News November 12, 2025
HYD: ఒక్క నెలలో రూ.13 కోట్లు తగ్గిన ఎకరం!

రియల్ ఎస్టేట్ రంగం ఇటీవల కాలంలో మందగమనంలోకి వెళ్లిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. తాజాగా టీజీఐఐసీ నిర్వహించిన రాయదుర్గ్ పాన్మక్తా భూముల వేలంలో ఎకరాకు రూ.164 కోట్లు మాత్రమే పలకడం వివాదాస్పదంగా మారింది. గత నెలలో ఇదే ప్రాంతంలో ఎకరాకు రూ.177 కోట్లు వచ్చినప్పటికీ, ఒక్క నెలలోనే రూ.13 కోట్ల తేడా రావడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ధరల వ్యత్యాసం వెనుక రాజకీయ ప్రభావం ఉందా? అనే చర్చ నడుస్తోంది.
News November 12, 2025
NIA, ఐబీ చీఫ్లతో అమిత్ షా భేటీ

ఢిల్లీ పేలుడుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నతాధికారులతో మరోసారి కీలక భేటీ నిర్వహిస్తున్నారు. ఎన్ఐఏ, ఐబీ చీఫ్లతో తన కార్యాలయంలో సమావేశం అయ్యారు. బ్లాస్ట్ దర్యాప్తుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం మరోసారి భేటీ కానున్నట్లు సమాచారం. అటు ఫరీదాబాద్-ఢిల్లీ బ్లాస్ట్ లింక్పై NIA ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేసింది.


