News November 12, 2025
శబరిమలకు కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు

అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం కాజీపేట జంక్షన్ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఏ. శ్రీధర్ తెలిపారు. ఈ నెల 24న చర్లపల్లి-కొట్టాయం (07115), 25న కొట్టాయం-చర్లపల్లి (07116) ఎక్స్ప్రెస్లు కాజీపేటకు చేరుకుంటాయి. ఈ రైళ్లు వరంగల్, ఖమ్మం, విజయవాడ తదితర స్టేషన్లలో ఆగుతాయి.
Similar News
News November 12, 2025
HYD: ఒక్క నెలలో రూ.13 కోట్లు తగ్గిన ఎకరం!

రియల్ ఎస్టేట్ రంగం ఇటీవల కాలంలో మందగమనంలోకి వెళ్లిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. తాజాగా టీజీఐఐసీ నిర్వహించిన రాయదుర్గ్ పాన్మక్తా భూముల వేలంలో ఎకరాకు రూ.164 కోట్లు మాత్రమే పలకడం వివాదాస్పదంగా మారింది. గత నెలలో ఇదే ప్రాంతంలో ఎకరాకు రూ.177 కోట్లు వచ్చినప్పటికీ, ఒక్క నెలలోనే రూ.13 కోట్ల తేడా రావడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ధరల వ్యత్యాసం వెనుక రాజకీయ ప్రభావం ఉందా? అనే చర్చ నడుస్తోంది.
News November 12, 2025
HYD: ఒక్క నెలలో రూ.13 కోట్లు తగ్గిన ఎకరం!

రియల్ ఎస్టేట్ రంగం ఇటీవల కాలంలో మందగమనంలోకి వెళ్లిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. తాజాగా టీజీఐఐసీ నిర్వహించిన రాయదుర్గ్ పాన్మక్తా భూముల వేలంలో ఎకరాకు రూ.164 కోట్లు మాత్రమే పలకడం వివాదాస్పదంగా మారింది. గత నెలలో ఇదే ప్రాంతంలో ఎకరాకు రూ.177 కోట్లు వచ్చినప్పటికీ, ఒక్క నెలలోనే రూ.13 కోట్ల తేడా రావడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ధరల వ్యత్యాసం వెనుక రాజకీయ ప్రభావం ఉందా? అనే చర్చ నడుస్తోంది.
News November 12, 2025
NIA, ఐబీ చీఫ్లతో అమిత్ షా భేటీ

ఢిల్లీ పేలుడుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నతాధికారులతో మరోసారి కీలక భేటీ నిర్వహిస్తున్నారు. ఎన్ఐఏ, ఐబీ చీఫ్లతో తన కార్యాలయంలో సమావేశం అయ్యారు. బ్లాస్ట్ దర్యాప్తుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం మరోసారి భేటీ కానున్నట్లు సమాచారం. అటు ఫరీదాబాద్-ఢిల్లీ బ్లాస్ట్ లింక్పై NIA ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేసింది.


