News November 12, 2025

కమిషన్‌తో ఎంత ముట్టిందంటూ ధర్మారెడ్డిని ప్రశ్నించిన సిట్.?

image

తిరుమల నెయ్యి టెండర్ విషయంలో అనేక ప్రశ్నలను సిట్ అధికారులు <<18263363>>ధర్మారెడ్డి<<>>పై సంధించారు. టెండర్ ప్రక్రియలో ఉండాల్సిన నియమాలను ఎందుకు మార్చారని సూటిగా ప్రశ్నించారట. “మిల్క్” అనే పదాన్ని 2020 FEBలో టెండర్ రూల్స్‌లో తొలగించి 2023 NOVలో ఎందుకు చేర్చారని సిట్ ఆరా తీసింది. కమిషన్స్ ద్వారా ఎంత ముట్టింది, ఒక్కో ట్యాంకర్‌కు ఎంత కమిషన్స్ అందింది అని అడిగినట్లు సమాచారం. వీటిని ధర్మారెడ్డి తోసిపుచ్చారట.

Similar News

News November 12, 2025

సికింద్రాబాద్‌లోని NIEPMDలో ఉద్యోగాలు

image

సికింద్రాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీస్ (<>NIEPMD<<>>) 13 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 17న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి ఇంటర్, డిప్లొమా, బీటెక్/PG ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.200. రాత పరీక్ష/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.niepid.nic.in

News November 12, 2025

అయ్యప్ప మాల ఎవరు ధరించకూడదు?

image

తల్లిదండ్రులు మరణించినప్పుడు పన్నెండు నెలలు సూతకం కారణంగా దీక్షను, యాత్రను విరమించాలి. ఇంట్లో నూతన శిశువు జన్మించినా లేదా స్త్రీలు ఏడో నెల గర్భవతులైనా పురుషులు దీక్ష తీసుకోకూడదు. అనుకోని అశుభాలు సంభవిస్తే దీక్ష విరమించి, తిరిగి దీక్ష చేయాలనుకుంటే 41 రోజులు పూర్తయ్యేలా చూసుకోవాలి. స్త్రీలలో 10 ఏళ్లలోపు బాలికలు, రుతుక్రమం కానివారు, రుతుక్రమం ఆగిపోయినవారు మాత్రమే దీక్షకు అర్హులు. <<-se>>#AyyappaMala<<>>

News November 12, 2025

తణుకు: కూతురి హత్య కేసులో తల్లిదండ్రులు అరెస్ట్

image

తణుకు మండలం ముద్దాపురంలో మూడేళ్ల కిందట యువతి సజీవ దహనం కేసులో ఆమె తండ్రితో పాటు సవతి తల్లిని బుధవారం తణుకు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ కృష్ణ కుమార్ వివరాల మేరకు.. యువతికి చెందిన ఆస్తి కోసం సవతి తల్లి ముళ్లపూడి రూప, శ్రీనివాసు ఆమెను సజీవదహనం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అప్పట్లో పనిచేసిన పోలీసు అధికారుల పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.