News November 12, 2025
HYD: శ్రీధర్రావు ఆక్రమణలను తప్పుబట్టిన హైకోర్టు

గచ్చిబౌలిలోని FCI ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు ఆక్రమణలను హైకోర్టు తప్పు పట్టింది. రహదారులు ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టడాన్ని తీవ్రంగా పరిగణించింది. మెజార్టీ ప్లాట్లు తనవే అనే ఉద్దేశంతో ఆక్రమిస్తే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించింది. అందుకే హైడ్రా ఆ ఆక్రమణలను తొలగించిందని పేర్కొంది.
Similar News
News November 12, 2025
తొలి టెస్టులో పంత్, జురెల్ ఆడవచ్చేమో: డస్కాటే

ఈ నెల 14 నుంచి సౌతాఫ్రికాతో జరగనున్న టెస్టులో పంత్, జురెల్ ఇద్దరూ ఆడే అవకాశం ఉందని IND అసిస్టెంట్ కోచ్ డస్కాటే వెల్లడించారు. ఇలా జరగకపోతే ఆశ్చర్యపోవాల్సిన విషయమేనన్నారు. ఇటీవల SA-Aతో జరిగిన అనధికార టెస్టులో జురెల్ <<18235138>>రెండు సెంచరీలు<<>> చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇద్దరు కీపర్లలో ఒకరిని బ్యాటర్గా ఆడించనున్నట్లు తెలుస్తోంది. అటు ఆల్రౌండర్ నితీశ్కు ఆడే అవకాశం రాకపోవచ్చని డస్కాటే పేర్కొన్నారు.
News November 12, 2025
పిల్లలు ఎక్కువసేపు కూర్చొనే ఉంటున్నారా?

బాల్యంలో ఎక్కువసేపు కదలకుండా కూర్చొనేవారికి పెద్దయ్యాక గుండెపోటు, పక్షవాతం ముప్పు పెరుగుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఫిన్లాండ్ అధ్యయనం హెచ్చరిస్తోంది. బరువు, రక్తపోటు మామూలుగానే ఉన్నా కూర్చొనే సమయం పెరుగుతున్నకొద్దీ గుండెజబ్బు, పక్షవాతం, మరణం ముప్పు రెండింతలు ఎక్కువవుతోంది. కాబట్టి పిల్లలను వీలైనంత వరకు చురుకుగా ఉండేలా ప్రోత్సహించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
News November 12, 2025
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి: మంత్రి కోమటిరెడ్డి

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈరోజు కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పంట నష్టంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాల గురించి చర్చించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అధికారులు పాల్గొన్నారు.


