News November 12, 2025

కరీంనగర్: గ్రామీణ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

image

KNR జిల్లా తిమ్మాపూర్లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో సీసీటీవీ సర్వీసింగ్ & ఇన్స్టాలేషన్ లో నిరుద్యోగుల నుంచి ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు SBI RSETI సంస్థ డైరెక్టర్ డీ.సంపత్ తెలిపారు. ఉమ్మడి KNR జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 18-45సం. పురుషులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు Nov12లోపు దరఖాస్తు చేసుకోవాలని, Nov 13 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు.

Similar News

News November 12, 2025

రైలు ఢీకొని ఏల్చూరు మహిళ మృతి

image

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కూరగాయల మార్కెట్ సమీపాన రైలు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. సమాచారం మేరకు సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన పోలిశెట్టి మహాలక్ష్మి రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆమె మృతి చెందింది. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 12, 2025

KMR: వైద్య వృత్తిలో సేవా భావంతో పనిచేయాలి: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల MBBS మొదటి సంవత్సర 100 మంది విద్యార్థుల కోసం బుధవారం ‘వైట్ కోట్ సెరిమనీ’, కడవెరిక్ ఓత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన విద్యార్థులకు వైట్ కోటులను అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు వైద్య వృత్తిలో సేవాభావంతో పని చేయలన్నారు.

News November 12, 2025

అభివృద్ధి ప‌థంలో ప‌ర్యాట‌క రంగం కీల‌కం: కలెక్టర్

image

స్వ‌ర్ణాంధ్ర‌, విక‌సిత్ భార‌త్ సాకారానికి స‌మ్మిళిత‌, సుస్థిర ఆర్థిక వృద్ధి ముఖ్య‌మ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశా అన్నారు. క‌లెక్ట‌ర్ బుధ‌వారం ట్రెయినీ ఐఏఎస్ అధికారుల‌తో క‌లిసి కొండ‌ప‌ల్లి ఖిల్లాకు ట్రెక్కింగ్ చేశారు. వారికి ఖిల్లా చారిత్ర‌క వైభ‌వాన్ని వివ‌రించారు. కొండ‌ప‌ల్లి కోట‌ను ప‌ర్యాట‌కంగా మ‌రింత అభివృద్ధి చేసేందుకు చొర‌వ తీసుకుంటున్నామ‌ని వివరించారు.