News November 12, 2025

పుట్టపర్తికి రాష్ట్రపతి, ప్రధాని రాక

image

పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19న పుట్టపర్తికి రానున్నారు. 22న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, 23న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్‌లు, దేశవిదేశీ వీవీఐపీలు రానున్నారు. ఈ నెల 13 నుంచి 23 వరకూ పది రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చెప్పారు.

Similar News

News November 12, 2025

అండ దానం గురించి తెలుసా?

image

వయసు పైబడిన మహిళలు, పదే పదే ఐ.వి.ఎఫ్‌లు ఫెయిల్‌ అయిన వాళ్లకు అండాల అవసరం ఉంటుంది. అలాగే ఆర్టిఫిషియల్‌ రిప్రొడక్టివ్‌ బ్యాంకుల నుంచి మాత్రమే అండాలను తీసుకోవలసి ఉంటుంది. గతంలో ఏ మహిళైనా, ఎన్నిసార్లైనా తమ అండాలను అమ్ముకోగలిగే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు 23 నుంచి 35 ఏళ్ల మహిళలు మాత్రమే ఎగ్‌ డొనేషన్‌కు అర్హులు. అలాగే ఒక మహిళ తన జీవిత కాలంలో, కేవలం ఒక్కసారి మాత్రమే అండాలను డొనేట్‌ చేయాలి.

News November 12, 2025

చింతూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

చింతూరు (M) తుమ్మలలో బుధవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు SI రమేష్ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. చింతూరు-భద్రాచలం వైపు బైక్‌పై ముగ్గురు వ్యక్తులు వెళ్తున్నారు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి రోడ్డు‌పై పడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా శివకృష్ణ మృతి చెందాడు. మృతుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం చెరువుపల్లికి చెందిన శివకృష్ణగా గుర్తించారు.

News November 12, 2025

విద్యార్థిని అభినందించిన మంత్రి దుర్గేష్

image

నిడదవోలుకు చెందిన విద్యార్థిని కుంచాల కైవల్యా రెడ్డి నాసా ప్రతిష్ఠాత్మకమైన ఇంటర్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం(ఐఏఎస్పీ)కి ఇటీవల ఎంపికైంది. దీనిపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేస్తూ..కుంచాల కైవల్య రెడ్డిని అభినందించారు. విద్యార్థిని తల్లిదండ్రులను నిడదవోలు టౌన్ రోటరీ ఆడిటోరియంలో బుధవారం కలిశారు.