News November 12, 2025

వనపర్తి: ‘రెవెన్యూ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి’

image

రెవెన్యూ సదస్సు ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సు ద్వారా 41,100 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 30,672 ఎకరాల కవరేజీ ఉందని తెలిపారు. ఇప్పటివరకు 5,863 ఎకరాలు అప్‌డేట్ చేసినట్లు చెప్పారు.

Similar News

News November 12, 2025

కరీంనగర్: ఆస్తి కోసం వేధిస్తున్న కొడుకు, కొడలుపై ఫిర్యాదు

image

ఆస్తి కోసం తెల్ల కాగితం మీద సంతకం చేయించుకొని ఆస్తి కాజేయాలని తన కొడుకు, కోడలు ప్రయత్నిస్తున్నారని HZB ఆర్డీఓకు వృద్ధ దంపతులు ఫిర్యాదు చేశారు. జమ్మికుంటకు చెందిన గుల్లి లక్ష్మీ-మొగిలిలకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నట్లు చెప్పారు. పెద్ద కొడుకు, కోడలు సంపత్-స్వరూప తెల్ల కాగితం మీద సంతకాలు చేయించుకుని ఆస్తి కాజేయాలని చూస్తున్నారని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు.

News November 12, 2025

వరంగల్: జనజాతీయ గౌరవ్ దివాస్ ప్రత్యేక గ్రామసభలు

image

ఏటూరునాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనజాతీయ గౌరవ్ దివాస్ గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు పీవో చిత్రామిశ్రా తెలిపారు. ఈనెల 13న ఉమ్మడి జిల్లాలోని 49 ఆదిసేవ కేంద్రాలలో ప్రత్యేక గ్రామసభలు ఉంటాయన్నారు. ఈ జన్ సున్వాయ్ సెషన్‌లో గ్రామాల్లోని మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు, ప్రజా స్పందనలపై చర్చిస్తారన్నారు. 15న బిర్సాముండా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు పీవో పేర్కొన్నారు.

News November 12, 2025

అధికారులకు విజయనగరం కలెక్టర్ కీలక ఆదేశాలు

image

జిల్లాలో పలు ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం అవసరమైన భూములను వెంటనే అందజేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించిన ఆయన, మురుగునీటి ట్రీట్మెంట్ ప్లాంట్లు, బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లు, విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు భూములు త్వరగా ఇవ్వాలని సూచించారు. అందరికీ ఇళ్లు పథకం దరఖాస్తులను వేగంగా పరిశీలించాలన్నారు.