News November 12, 2025

NRPT: ‘ప్రజల ఆశ, అత్యాశే మోసగాళ్ల ఆయుధం’

image

డబ్బుపై ప్రజలకు ఉండే ఆశ, అత్యాశే సైబర్ మోసగాళ్లకు ఆయుధాలని ఎస్పీ డాక్టర్ వినీత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ మోసంలో నష్టపోయి బాధపడటం కంటే అవగాహనతో ముందు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమన్నారు. స్మార్ట్‌ఫోన్‌లకు వచ్చే అనవసరపు లింకులు, ఏపీకే ఫైల్స్‌ను తెరవకుండా ఉండటం మంచిదని సూచించారు. ఆర్థికంగా నష్టపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.

Similar News

News November 12, 2025

కరీంనగర్: ఏసీబీ రైడ్‌లో నమోదైన కేసుల వివరాలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2025లో ఇప్పటి వరకు నమోదు చేసిన కేసుల వివరాలను ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు. రెవెన్యూ-8, పంచాయితీ రాజ్-6, రిజిస్ట్రేషన్-3, ఖజానా-3, మున్సిపల్-3, అగ్రికల్చర్-3, ఔషధ విభాగం-3, ఆర్టీఏ-3, పోలీస్-1 రెడ్ హ్యాండెడ్‌గో పట్టుకున్నామన్నారు. 30 మందిని అరెస్టు చేసి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

News November 12, 2025

స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో అధికారులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కలెక్టర్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం పాడేరులో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలో అనేక మంది రక్తహీనతతో బాధపడుతున్నారన్నారు. గర్భిణులు, బాలింతలు, శస్త్రచికిత్స అవసరమైన వారికి రక్తం అవసరం ఉంటుందన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు.

News November 12, 2025

అలర్ట్.. వచ్చే వారం రోజులు జాగ్రత్త!

image

TG: రాబోయే వారం రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే ఆస్కారం ఉందని తెలిపింది. దీంతో జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులతో కూడిన సీజనల్ ఫ్లూ వ్యాప్తి చెందవచ్చని హెచ్చరించింది. గర్భిణులు, 65 ఏళ్లు పైబడిన వారు, 5 ఏళ్ల లోపు పిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.