News November 12, 2025
ఉగ్రవాదులను చట్టం ముందు నిలబెడతాం: కేంద్రం

ఢిల్లీ పేలుడు మృతులకు కేంద్ర క్యాబినెట్ సంతాపం తెలిపింది. ఇది ఉగ్రవాద చర్య అని అధికారికంగా ప్రకటించింది. ఉగ్రవాదులను చట్టం ముందు నిలబెడతామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ‘దర్యాప్తును అత్యవసరంగా నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఉగ్రవాదులు, వారి స్పాన్సర్లను గుర్తించి, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించింది’ అని తెలిపారు. పరిస్థితిని అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News November 13, 2025
శుభ సమయం (13-11-2025) గురువారం

✒ తిథి: బహుళ నవమి తె.3.31 వరకు
✒ నక్షత్రం: మఖ రా.12.15 వరకు
✒ శుభ సమయాలు: లేవు
✒ రాహుకాలం: మ.1.30-మ.3.00
✒ యమగండం: ఉ.6.00-ఉ.7.30
✒ దుర్ముహూర్తం: ఉ.10.00-ఉ.10.48, మ.2.48-మ.3.36
✒ వర్జ్యం: మ.12.13-మ.1.49
✒ అమృత ఘడియలు: రా.9.49-రా.11.25
News November 13, 2025
Today Headlines

*ఢిల్లీ పేలుడు ఉగ్రదాడేనన్న కేంద్ర క్యాబినెట్.. కారకులను చట్టం ముందు నిలబెడతామని తీర్మానం
*ప్రభుత్వ వైఫల్యం వల్లే పేలుడు: ఖర్గే
*3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం
*మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వైసీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలు
*రిగ్గింగ్ చేయడం సాధ్యం కాదన్న TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
*UPSC సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల
News November 13, 2025
బ్లాస్ట్ చేసిన వారికే కాంగ్రెస్ సపోర్ట్: బీజేపీ

ఢిల్లీ బ్లాస్ట్ కారకులకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తోందని BJP మండిపడింది. ఎన్నికల సమయంలోనే ఉగ్రవాద దాడులు జరగడానికి కారణమేంటని సిద్దరామయ్య ప్రశ్నించడంపై ఫైర్ అయింది. సిద్దరామయ్య, ఇతర కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని, వారివి దిగజారుడు రాజకీయాలని BJP కర్ణాటక చీఫ్ విజయేంద్ర మండిపడ్డారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని పార్టీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ విమర్శించారు.


