News November 12, 2025

జమ్మూకశ్మీర్‌లో 500 ప్రాంతాల్లో పోలీసుల దాడులు

image

ఢిల్లీ పేలుడు నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ఏకంగా 500 లొకేషన్లలో రెయిడ్స్ చేపట్టారు. జమాతే ఇస్లామీ(JeI), ఇతర నిషేధిత సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు, టెర్రరిస్టు సహాయకులకు చెందిన ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. JeI అనుబంధ టెర్రరిస్టులు తమ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం వచ్చిందని అధికారులు తెలిపారు.

Similar News

News November 13, 2025

శుభ సమయం (13-11-2025) గురువారం

image

✒ తిథి: బహుళ నవమి తె.3.31 వరకు
✒ నక్షత్రం: మఖ రా.12.15 వరకు
✒ శుభ సమయాలు: లేవు
✒ రాహుకాలం: మ.1.30-మ.3.00
✒ యమగండం: ఉ.6.00-ఉ.7.30
✒ దుర్ముహూర్తం: ఉ.10.00-ఉ.10.48, మ.2.48-మ.3.36
✒ వర్జ్యం: మ.12.13-మ.1.49
✒ అమృత ఘడియలు: రా.9.49-రా.11.25

News November 13, 2025

Today Headlines

image

*ఢిల్లీ పేలుడు ఉగ్రదాడేనన్న కేంద్ర క్యాబినెట్.. కారకులను చట్టం ముందు నిలబెడతామని తీర్మానం
*ప్రభుత్వ వైఫల్యం వల్లే పేలుడు: ఖర్గే
*3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం
*మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వైసీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలు
*రిగ్గింగ్ చేయడం సాధ్యం కాదన్న TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
*UPSC సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల

News November 13, 2025

బ్లాస్ట్ చేసిన వారికే కాంగ్రెస్ సపోర్ట్: బీజేపీ

image

ఢిల్లీ బ్లాస్ట్ కారకులకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తోందని BJP మండిపడింది. ఎన్నికల సమయంలోనే ఉగ్రవాద దాడులు జరగడానికి కారణమేంటని సిద్దరామయ్య ప్రశ్నించడంపై ఫైర్ అయింది. సిద్దరామయ్య, ఇతర కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని, వారివి దిగజారుడు రాజకీయాలని BJP కర్ణాటక చీఫ్ విజయేంద్ర మండిపడ్డారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని పార్టీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ విమర్శించారు.