News November 13, 2025
అధికారికంగా జూబ్లీహిల్స్లో 48.49% ఓటింగ్

జూబ్లీహల్స్ బైపోల్ వివరాలు అధికారికంగా వెల్లిడించారు. మొత్తం 4,01,365 మంది ఓటర్లలో పురుషులు 2,08,561 మంది ఉండగావారిలో 99,771 మంది, మహిళలు 1,92,779 మంది ఉండగా 94,855 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇతరులు 25 మంది ఉండగా ఐదుగురు ఓటింగ్లో పాల్గొన్నారు. మొత్తంగా 1,94,631 మంది ఓటేశారని అధికారికంగా గణాకాంలు ఇవాళ విడుదల అయ్యాయి. 48.49%తో అతి తక్కువ ఓటింగ్ మనవద్దే నమోదు కావడం గమనార్హం.
Similar News
News November 13, 2025
ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలో ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాజెక్టులను వేగవంతంగా చేయాలని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ బుధవారం అధికారులను ఆదేశించారు. రహదారులు, స్వదేశీ దర్శన్, నిజాంపట్నం షిప్పింగ్ హార్బర్, ఆక్వాపార్క్ పనులపై కలెక్టరేట్ న్యూ వీసీ హాల్లో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సూర్యలంక బీచ్, ఆక్వాపార్క్ అభివృద్ధిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
News November 13, 2025
మహిళను వేధించిన కేసులో వ్యక్తికి జైలు

మహిళను వేధించిన కేసులో కోర్టు ఒకరికి జైలు శిక్ష విధించినట్లు కొల్లూరు SI అమర వర్ధన్ తెలిపారు. SI వివరాల మేరకు తాడిగిరిపాడుకు చెందిన టి. క్రీస్తురాజు అదే గ్రామానికి చెందిన ఓ మహిళని 2022లో వేధించేవాడు. మహిళ ఫిర్యాదుతో నిందితుడిపై కేసు నమోదైంది. అతనిపై నేరం నిరూపణ అవ్వటంతో తెనాలి ప్రధాన సివిల్ జడ్జ్ పవన్ కుమార్ ఒక నెల జైలు శిక్ష, రూ.1000లు జరిమాన విధించారు.
News November 13, 2025
విశాఖ సదస్సుతో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎంవో

AP: విశాఖలో జరగనున్న CII భాగస్వామ్య సదస్సుకు రూ.10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోందని CMO తెలిపింది. ఈ సమావేశంలో ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు జరుగుతాయని వెల్లడించింది. ‘ఇన్వెస్ట్ ఇన్ ఏపీ’ సందేశాన్ని సమ్మిట్ ద్వారా చాటి చెప్పాలని సీఎం చంద్రబాబు సంకల్పించినట్లు పేర్కొంది. కాగా ఈ సదస్సులో సీఎం వైజాగ్కు చేరుకోగా ఆయనకు హోంమంత్రి అనిత, పలువురు మంత్రులు స్వాగతం పలికారు.


