News November 14, 2025
ఇటిక్యాల: బాలిక కిడ్నాప్ కేసు.. 35 ఏళ్లు జైలు

మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, రేప్ చేసిన కేసులో ఇటిక్యాల మండలం గార్లపాడుకు చెందిన చాకలి హరిచంద్రకు 35 ఏళ్లు జైలు శిక్ష, రూ. 50 వేలు జరిమానా విధిస్తూ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి రవికుమార్ గురువారం గద్వాలలో తీర్పునిచ్చారు. నేరస్థుడిపై కోదండపూర్ పిఎస్లో 22-7-2017 కేసు నమోదైంది. విచారణ చేపట్టిన కోర్టు లైసెన్స్ అధికారులు సాయిబాబ, జిక్కి బాబు అతడికి శిక్ష పడే విధంగా కృషి చేశారు.
Similar News
News November 14, 2025
చిల్డ్రన్స్ డే నవంబర్ 20న జరుపుకునేవారు తెలుసా?

పిల్లలపై మాజీ ప్రధాని నెహ్రూ చూపిన ప్రేమ, వారి విద్య కోసం ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది నవంబర్ 14న బాలల దినోత్సవం నిర్వహిస్తారు. గతంలో UNO ప్రకటించిన నవంబర్ 20న దీనిని సెలబ్రేట్ చేసుకునేవారు. 1964లో నెహ్రూ మరణానంతరం ఆయనకు నివాళిగా మన దేశంలో నవంబర్ 14కి మార్చారు. పిల్లల హక్కులు, విద్య, అభివృద్ధి, సమానత్వం, రక్షణపై అవగాహన పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యం.
News November 14, 2025
ఆ ఎకరం.. పోషకాల వరి వంగడాలకు నిలయం

యాదగిరి శ్రీనివాస్ పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానంలో సేద్యం చేస్తున్నారు. తనకు 3 ఎకరాల భూమి ఉండగా 2 ఎకరాల్లో సాధారణ రకాలను, మరో ఎకరంలో 400 వరి రకాలను సాగు చేస్తున్నారు. మంచి పోషక విలువలతో కూడిన తులసి బాసో, ఇతర ఎర్ర, నల్ల వరి రకాలు కూడా శ్రీనివాస్ భూమిలో పండుతున్నాయి. అవసరం మేరకు విత్తనాలను భద్రపరిచి.. ఆసక్తి ఉన్న రైతులకు విత్తనాలను అందిస్తూ, మిగిలిన వాటిని బియ్యంగా మార్చి విక్రయిస్తున్నారు.
News November 14, 2025
250 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

కేబినెట్ సెక్రటేరియట్ 250 డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. BE, B.Tech, MScతో పాటు GATE ఉత్తీర్ణులైన వారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. NOV 15 నుంచి DEC 14 వరకు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. గేట్ స్కోరు, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.


