News November 14, 2025

విద్యార్థులకు అలర్ట్.. ఇవాళ్టి ఎగ్జామ్ వాయిదా

image

AP: రాష్ట్రంలోని యాజమాన్య స్కూళ్లలో ఇవాళ నిర్వహించే <<18204293>>సమ్మెటివ్-1<<>> పరీక్ష వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. బాలల దినోత్సవం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. 1-5 తరగతులకు సంబంధించిన ఎగ్జామ్ ను ఈ నెల 17న, 6-10 తరగతులకు సంబంధించిన పరీక్షను తిరిగి ఈ నెల 20న నిర్వహిస్తామని వెల్లడించింది.

Similar News

News November 14, 2025

బిహార్: మ్యాజిక్ ఫిగర్ దాటిన NDA

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో NDA దూసుకుపోతోంది. లీడింగ్‌లో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 122ను దాటేసింది. ప్రస్తుతం NDA 155, MGB 65, JSP 3స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ప్రధాన పార్టీల వారీగా చూస్తే BJP:78, JDU: 65, RJD:59, కాంగ్రెస్: 11.

News November 14, 2025

పిల్లల్లో ADHDకి మందులు వాడుతున్నారా?

image

కొందరు పిల్లల్లో అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపరాక్టివ్‌ డిసీజ్‌ వస్తుంటుంది. అయితే కొందరు వైద్యులు వ్యాధి నిర్ధారణ అవ్వగానే మందులు ఇస్తారు. కానీ ఇది సరికాదంటోంది స్టాన్‌ఫర్డ్‌ మెడిసిన్‌ తాజా అధ్యయనం. ఆరేళ్లలోపు పిల్లల్లో మందులను ప్రాసెస్‌ చేసే మెటబాలిజం పూర్తిగా అభివృద్ధి చెందదు. కాబట్టి మందుల వల్ల ఎలాంటి ప్రయోజనమూ దక్కదు. దానికంటే ముందు వాళ్లకు బిహేవియరల్‌ థెరపీ ఇవ్వాలని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

News November 14, 2025

రెండో రౌండ్‌లోనూ సేమ్ సీన్

image

జూబ్లీహిల్స్ బైపోల్ రెండో రౌండ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులోనూ నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్‌లో నవీన్‌కు 9,691, మాగంటి సునీతకు 8,690 ఓట్లు పోలయ్యాయి. రెండు రౌండ్లు కలిపి కాంగ్రెస్ అభ్యర్థి 1,144 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడో రౌండ్‌లో వెంగళరావు నగర్, సోమాజిగూడ డివిజన్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది.