News November 14, 2025
ఛైర్మన్ హోదాలో నేనే పర్యవేక్షిస్తా: సీఎం చంద్రబాబు

9 జిల్లాలతో కూడిన విశాఖ ఎకనామిక్ రీజియన్ అథారిటీకి ఛైర్మన్ హోదాలో తానే స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు. భవిష్యత్ ఆర్థిక శక్తిగా ఏపీని నిర్దేశించే మోడల్ అని అన్నారు. ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ డాక్యుమెంట్ను నీతిఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యంతో కలిసి విడుదల చేశారు. విశాఖ-శ్రీకాకుళం కారిడార్ను నౌకా నిర్మాణ హబ్గా, భోగాపురం విమానాశ్రయం పరిధిలో ఏరో సిటీని అభివృద్ధి చేస్తామన్నారు.
Similar News
News November 14, 2025
WGL: నివేదిక ఆధారంగానే విజిలెన్స్ విచారణ!

ఎంజీఎం ఆసుపత్రిలో నిధుల కుంభకోణం జరిగిందంటూ<<18275353>> Way2Newsలో వచ్చిన కథనం<<>>పై డీఎంఈ విచారణకు త్రిసభ్య కమిటీని నియమించారు. కమిటీ విచారణలో నిధుల దుర్వినియోగం జరిగినట్టు తేలడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. తొలి రోజు విచారణలో చాలా వరకు ఓచర్లు లేకుండానే చెల్లింపులు జరిపినట్టు తేలింది.మరో 2 రోజుల పాటు విచారణ జరుగుతుందని సమాచారం. మొత్తానికి రూ.29 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్టు తెలుస్తోంది.
News November 14, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: మిగిలిన 8 రౌండ్లు కీలకం

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యం కొనసాగుతోంది. మొత్తం రెండు రౌండ్లలో ఆయన ఆధిక్యం 1,144కు చేరింది. రెండో రౌండ్లో నవీన్ యాదవ్కు 9691, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8609 ఓట్లు వచ్చాయి. ఇంకా 8 రౌండ్లు మిగిలి ఉండగా.. అభ్యర్థి గెలుపులో కీలకం కానున్నాయి.
News November 14, 2025
బిహార్: మ్యాజిక్ ఫిగర్ దాటిన NDA

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో NDA దూసుకుపోతోంది. లీడింగ్లో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 122ను దాటేసింది. ప్రస్తుతం NDA 155, MGB 65, JSP 3స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ప్రధాన పార్టీల వారీగా చూస్తే BJP:78, JDU: 65, RJD:59, కాంగ్రెస్: 11.


