News November 14, 2025
BREAKING: శంషాబాద్ విమానాశ్రయంలో FULL EMERGENCY ప్రకటన

లండన్ నుంచి HYD వచ్చే BA 277 (STA 05:20) విమానానికి బాంబ్ బెదిరింపు కారణంగా ఈరోజు ఉదయం 4:46 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. 5:10 గంటలకు 167 మంది ప్రయాణికులు, ఇద్దరు శిశువులు, ఇద్దరు కాక్పిట్ సిబ్బంది, 8 కేబిన్ సిబ్బందితో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానాన్ని ప్రస్తుతం ఐసోలేషన్ బేకు తరలించి తనిఖీ చేస్తున్నారు.
Similar News
News November 14, 2025
నేను టీటీడీ ఉద్యోగిని కాను: రవి కుమార్

పరకామణి చోరీ కేసులో సీఐడీ విచారణ, రవికుమార్ ఆస్తులు, కుటుంబసభ్యుల ఆస్తులపై ఏసీబీతో విచారణ చేయాలనే హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని రవికుమార్ వాజ్యం వేశారు. సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పరకామణి వ్యవహారంలో సుమోటో వ్యాజ్యంను మేమే విచారిస్తామని సీజే బెంచ్ తెలిపింది. అయితే నేను టీటీడీ ఉద్యోగిని కాను, నిర్వచనం పరిధిలోకి రాను, ఏసీబీ విచారణ ఆపాలని కోరారు.
News November 14, 2025
BRSకు స్వల్ప ఆధిక్యం

జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడో రౌండ్లోని ఒక EVMలో BRSకు స్వల్ప ఆధిక్యం వచ్చింది. మూడో రౌండ్లో ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రహమత్ నగర్ ఓట్లను లెక్కించారు. అటు ఇప్పటివరకు 3 రౌండ్లలో కలిపి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది.
News November 14, 2025
కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<


