News November 14, 2025

వరంగల్: తటస్థంగా పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర నిన్నటి లాగే స్థిరంగా ఉంది. మంగళవారం, బుధవారం రూ.6,830 పలికిన క్వింటా పత్తి ధర గురువారం రూ.6,870 అయింది. శుక్రవారం కూడా అదే ధర పలికిందని వ్యాపారులు తెలిపారు. అయితే గతవారం రూ.7 వేలకు పైగా పలికిన ధర ఈ వారం భారీగా తగ్గడంతో అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు.

Similar News

News November 14, 2025

NLG: చేప పిల్లలు నాసిరకం: మత్స్యకారులు

image

జిల్లాలో చేప పిల్లల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. చెరువులు, కుంటలకు పూర్తిగా నాసిరకం సీడ్‌ వస్తున్నదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 6 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయనుండగా.. ఇప్పటివరకు 60 లక్షలకు పైగానే చేప పిల్లలు పంపిణీ చేశారు. జిల్లాలోని ముత్యాలమ్మ చెరువు, కోతకుంట, ఉంగూరుకుంట చెరువులకు పంపిణీ చేసిన చేప పిల్లలు నాసిరకంగా ఉన్నాయని మత్స్యకారులు ఆరోపించారు.

News November 14, 2025

రబీ మొక్కజొన్న కలుపు నివారణ ఎలా?

image

మొక్కజొన్న విత్తిన 48 గంటలలోపు 200 లీటర్ల నీటిలో తేలిక నేలలకు అట్రాజిన్ 800గ్రా, బరువు నేలల్లో 1200 గ్రా. కలిపి నేలపై తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. తర్వాత 25-30 రోజులకు కలుపు ఉద్ధృతిని బట్టి 200 లీటర్ల నీటిలో టెంబోట్రయాన్ 34.4%S.C ద్రావణం 115ml కలిపి కలుపు 3,4 ఆకుల దశలో పిచికారీ చేయాలి. తుంగ సమస్య ఎక్కువుంటే ఎకరాకు 200 లీటర్ల నీటిలో హేలోసల్ఫ్యురాన్ మిథైల్ 75 W.G 36 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.

News November 14, 2025

స్వచ్ఛతా అవార్డు అందుకున్న సింగరేణి C&MD

image

కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛతా స్పెషల్ క్యాంపెయిన్ 5.0 కార్యక్రమంలో సింగరేణి సంస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ కంపెనీగా ఎంపికైంది. ఢిల్లీలో గురువారం రాత్రి జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా సింగరేణి C&MD బలరాం అత్యుత్తమ స్వచ్ఛతా కంపెనీ అవార్డును అందుకున్నారు. సంస్థ అధికారులు, ఉద్యోగులను C&MD ఈ సందర్భంగా అభినందించారు.