News November 14, 2025
కోరుట్ల నుంచి RTC వన్డే SPL. TOUR

కోరుట్ల నుంచి ఈనెల 16న మాహోర్కు స్పెషల్ సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఉదయం 4 గంటలకు బస్సు బయలుదేరి రేణుకా మాతా(మావురాల ఎల్లమ్మ, పరశురామ), దత్తాత్రేయ పీఠం, ఏకవీర శక్తిపీఠం, ఉంకేశ్వర్- శివాలయం దర్శనాల అనంతరం బస్సు తిరిగి రాత్రి కోరుట్లకు చేరుతుందన్నారు. ఛార్జీలు ఒక్కరికి రూ.1,250గా నిర్ణయించారు. వివరాలకు 996361503 నంబర్ను సంప్రదించాలన్నారు.
Similar News
News November 14, 2025
Leading: ఎన్డీయే డబుల్ సెంచరీ

బిహార్లో అద్వితీయ విజయం దిశగా ఎన్డీయే దూసుకుపోతోంది. ప్రస్తుతం 200 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎంజీబీ కేవలం 37 స్థానాల్లోపే లీడ్లో ఉంది. మరోవైపు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలిచింది. ఆ పార్టీ 91 స్థానాల్లో లీడింగ్లో ఉంది. జేడీయూ 81, ఆర్జేడీ 28 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి.
News November 14, 2025
సంచలనం.. రికార్డు సృష్టించిన నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సంచలనం సృష్టించారు. మెజారిటీలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, విష్ణు రికార్డును బ్రేక్ చేశారు. ఇదివరకు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ రికార్డు 2009లో విష్ణు(కాంగ్రెస్) పేరిట ఉంది. ఆయన 21,741 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తాజా ఉపఎన్నికలో నవీన్ యాదవ్ దాదాపు 25వేల ఓట్ల మెజారిటీతో గెలిచి ఆ రికార్డును బ్రేక్ చేశారు.
News November 14, 2025
PDPL: శాండ్ రీచ్లను ఓపెన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం

పెద్దపల్లి జిల్లాలోని 19 శాండ్ రీచ్లు ఆగిపోవడంతో ప్రభుత్వం ఏడాదికి రూ.200 కోట్ల ఆదాయం కోల్పోతుంది. సహజ సంపదను తోడేయడంతో జీవవైవిధ్యం దెబ్బతింటుందంటూ మానేరు పరివాహక పరిరక్షణ సమితి NGTని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన NGT.. శాండ్ రీచ్లను నిలిపివేయాలని కలెక్టర్కు 2023లో ఆదేశాలు జారీచేసింది. అయితే ఈనెలలో NGT స్టేను వెకేట్ చేసి రీచ్లను ఓపెన్ చేసి ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.


