News November 14, 2025
ప్రాథమిక పాఠశాలల్లో డిజిటల్ బోధన: డీఈఓ వెంకటేశ్వర్లు

ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులకు డిజిటల్ ద్వారా బోధన అందిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) వెంకటేశ్వర్లు అన్నారు. సంగారెడ్డి మండలం కలబగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు అర్థమయ్యేలా చార్టుల ద్వారా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
Similar News
News November 14, 2025
వీటిని డీప్ ఫ్రై చేస్తే క్యాన్సర్ వచ్చే ఛాన్స్

బాగా ఫ్రై చేసిన కొన్ని పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాంసాన్ని డీప్ ఫ్రై చేస్తే హెటెరోసైక్లిక్ అమైన్స్, హైడ్రోకార్బన్స్, బంగాళదుంపలు, బ్రెడ్ డీప్ ఫ్రై చేస్తే అక్రిలైమైడ్, చికెన్ను డీప్ ఫ్రై చేస్తే కార్సినోజెన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి DNAను దెబ్బతీసి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. ఉడకబెట్టడం, బేకింగ్ మంచిదని సూచిస్తున్నారు.
News November 14, 2025
WNP: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, వాటిని గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. వనపర్తిలోని నాగవరం (10వ వార్డు)లో రిన్సీ మినీస్త్రీ సొసైటీ అధ్యక్షుడు గంధం బాలరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన గ్రంథాలయాన్ని ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. సాహితీ వేతలు, నారాయణరెడ్డి, బుచ్చయ్య, వీరాచారి, సత్తార్, నిరంజనయ్య తదితరులు పాల్గొన్నారు.
News November 14, 2025
HYD: BRSకు కలిసిరాని సింపతి!

జూబ్లీహిల్స్ బైపోల్లోనూ సింపతిని నమ్ముకున్న BRSకు కలిసిరాలేదు. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికలో లాస్య నివేదితను నిలబెట్టారు. అక్కడ కూడా సానుభూతి ఓట్లు రాల్చలేదు. అంతకుముందు దుబ్బాక ఉప ఎన్నికలోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. గోపినాథ్ మృతితో అనివార్యమైన జూబ్లీహిల్స్లో BRS అధిష్ఠానం ఆ కుటుంబానికే టికెట్ కేటాయించింది. ఇక్కడ మెజార్టీ ప్రజలు సింపతిని ఆదరించలేదు. దీంతో సునీత ఓటమి చవిచూశారు.


