News November 14, 2025

జూబ్లీ బైపోల్: కాంగ్రెస్‌ LEADను టచ్ చేయని BJP!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో BJPకి వచ్చిన ఓట్లు ఆ పార్టీ శ్రేణులను నిరాశలో పడేశాయి. పోస్టల్ బ్యాలెట్‌లో 20 ఓట్లు రాగా.. 10 రౌండ్లు ముగిసేసరికి లంకల దీపక్ రెడ్డి డిపాజిట్ గల్లంతైంది. మొత్తం పోలైన ఓట్లలో 8.76 శాతంతో 17,061 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ 50.83 శాతంతో 98,988 ఓట్లు సాధించారు. ప్రత్యర్థి మీద 24,729 ఓట్ల తేడాతో గెలుపొందారు. కనీసం INC LEAD ఓట్లు కూడా BJPకి రాకపోవడం గమనార్హం.

Similar News

News November 14, 2025

గచ్చిబౌలి స్టేడియంలో రెజోఫెస్ట్ 2025

image

రెజోనెన్స్ నిర్వహించిన రెజోఫెస్ట్ 2025 గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. 35 క్యాంపస్‌లకు చెందిన 7,000+ విద్యార్థులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. డా. జైతీర్థ్ ఆర్. జోషి, నాగ్ అశ్విన్, శర్వానంద్, సుమా కనకాల వంటి ప్రముఖులు హాజరై విద్యార్థులకు స్ఫూర్తి, సృజనాత్మకత, లక్ష్య సాధన గురుంచి వివరించారు.

News November 14, 2025

జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్ గెలుపుపై కూనంనేని హర్షం

image

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ విజయం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, MLA కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. విజ్ఞతతో ఓటు వేసిన ఓటర్లకు ఆయన ధన్యావాదాలు తెలియజేశారు. స్వయంగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌‌సభ నియోజకవర్గ పరిధి అయిన జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో BJP అభ్యర్థికి డిపాజిట్‌ గల్లంతయ్యిందన్నారు.

News November 14, 2025

జూబ్లీ తీర్పు: MP కావాలి.. MLA వద్దు!

image

MP ఎన్నిక, అసెంబ్లీ ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ ఓటర్లు వినూత్న తీర్పునిచ్చారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 65 వేల ఓట్లు వేసి కిషన్ రెడ్డి గెలుపులో కీలకంగా మారారు. అదే ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా ఇవ్వలేదు. దీపక్ రెడ్డికి మద్దతుగా కిషన్ రెడ్డి గల్లీ గల్లీ తిరిగినా 17 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. గత GHMC ఎన్నికల్లో ఇదే ఓటర్లు BRSను ఆదరించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ప్రజలు పార్టీలను చూసి ఓటేస్తున్నారు.