News November 14, 2025
పరకామణి చోరీ కేసులో విచారణ వేగవంతం

తిరుమల పరకామణి చోరీ కేసులో సీఐడీ బృందం విచారణ వేగవంతం చేసింది. శుక్రవారం మాజీ వీజీవో బాలిరెడ్డి, సీఐ చంద్రశేఖర్ సహా చోరీ జరిగిన రోజు డ్యూటీలో ఉన్న ఇతర ఉద్యోగులను విచారిస్తున్నారు. ఉదయం టీటీడీ జేఈవో కూడా వచ్చి వెళ్లినట్లు సమాచారం. మాజీ AVSO <<18285119>>సతీశ్ మృతి<<>>తో కేసు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.
Similar News
News November 14, 2025
జగిత్యాల: మెగా జాబ్ మేళా.. 350 మందికి ఉద్యోగాలు

జగిత్యాలలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ సహకారంతో ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 1,000 మంది మహిళా నిరుద్యోగులు పాల్గొన్నారు. అందులో 350 మందికి ఉద్యోగాలు లభించాయి. ఎంపికైన వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం విధుల్లో చేరేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
News November 14, 2025
60 పోస్టులకు TSLPRB నోటిఫికేషన్

తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(TSLPRB) 60 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులున్నాయి. అభ్యర్థులు ఈ నెల 27 ఉ.8 గంటల నుంచి డిసెంబర్ 15 సా. 5 గంటల వరకు <
News November 14, 2025
చేసిన మంచిని చెప్పుకోలేక ఇబ్బంది పడ్డా: CBN

AP: సంస్కరణలతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని CM CBN తెలిపారు. ఇందుకు HYD అభివృద్ధే ఉదాహరణ అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాలసీలు రూపొందించాలని సూచించారు. తాను చేసిన మంచిని చెప్పుకోవడంలో కొంచెం వెనుకబడడంతో గతంలో ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. గత ఐదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థతో పాటు AP ఇమేజ్ అంతర్జాతీయంగా దెబ్బతిందన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో ఖాతా తెరుస్తున్నామని తెలిపారు.


