News November 14, 2025
అటవీ భూముల సంరక్షణ అందరి బాధ్యత: కలెక్టర్

అటవీ భూముల సంరక్షణ అందరి బాధ్యత అని భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అటవీ భూముల పరిరక్షణను అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. కలెక్టరేట్లో ఈరోజు DFO కృష్ణ గౌడ్, ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్తో పాటు వివిధ శాఖల అధికారులతో సమావేశం అయ్యారు. గిరిజనులు పోడు నరకకుండా చూడటం అత్యవసరమని, ఇందుకోసం వారికి తగిన జీవనోపాధి అవకాశాలు కల్పించడం కీలకమని చెప్పారు.
Similar News
News November 14, 2025
PG పీజీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ లో జరిగిన పలు పీజీ కోర్సుల పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలను పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు ప్రకటించారు. ఎమ్మెస్సీ బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ నాలుగో సెమిస్టర్ ఫలితాలు ప్రకటించామన్నారు. ఫలితాలను వర్సిటీ వెబ్సైట్ www.anu.ac.in నుంచి పొందవచ్చని చెప్పారు.
News November 14, 2025
CII: 2 రోజుల్లోనే ₹7.15 లక్షల కోట్ల పెట్టుబడులు

AP: విశాఖలో నిర్వహిస్తున్న CII సదస్సు మంచి ఫలితాలిస్తోంది. నిన్న, ఇవాళ కలిపి ₹7,14,780 CR పెట్టుబడులపై 75 MOUలు జరిగాయి. వీటి ద్వారా 5,42,361 ఉద్యోగాలు రానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
* తొలి రోజు సదస్సులో మొత్తంగా 40 కంపెనీలతో ₹3,49,476 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. వీటి ద్వారా 4,15,890 ఉద్యోగాలు వచ్చే అవకాశం.
* నిన్న 35 ఒప్పందాల ద్వారా ₹3,65,304 కోట్ల పెట్టుబడులు. వీటితో 1,26,471 ఉద్యోగాలు.
News November 14, 2025
బిహార్ ప్రజలు రికార్డులు బద్దలుకొట్టారు: మోదీ

బిహార్ ప్రజలు వికసిత్ భారత్ కోసం ఓటేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘బిహార్లో NDA సాధించింది అతి పెద్ద విజయం. రికార్డుస్థాయిలో ఎన్నికల్లో పాల్గొనాలని నేను ఓటర్లను కోరాను. వాళ్లు రికార్డులు బద్దలుకొట్టారు. మేం ప్రజలకు సేవకులం. వారి మనసులు గెలుచుకున్నాం. బిహార్లో ఆటవిక రాజ్యం ఎప్పటికీ తిరిగిరాదు. కొందరు MY ఫార్ములాతో గెలవాలని చూశారు. మా ‘MY’ ఫార్ములా అంటే మహిళ, యూత్ ఫార్ములా’ అని తెలిపారు.


