News November 15, 2025
భీమడోలు: ఏడేళ్లుగా పరారీ.. నిందితుడి అరెస్ట్

భీమడోలు మండలం పూళ్లలో 2007లో జరిగిన హత్య కేసులో గుడివాడకు చెందిన నిందితుడు స్టీవెన్ను పోలీసులు శుక్రవారం విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. స్టీవెన్ ఏడేళ్ల నుంచి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన CI విల్సన్, SI మదీనా బాషా, హెడ్ కానిస్టేబుల్స్ శ్రీనివాసరావు, సురేష్ను SP ప్రతాప్ శివ కిషోర్ ప్రశంసించారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచామన్నారు.
Similar News
News November 15, 2025
పదో తరగతిలో 100% ఉత్తీర్ణతే లక్ష్యం: నంద్యాల కలెక్టర్

నంద్యాల జిల్లాలో పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులతో ఆమె సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల అధ్యయన పద్ధతులు, బోధనా ప్రమాణాల మెరుగుదలపై కలెక్టర్ మార్గదర్శకాలు ఇచ్చారు.
News November 15, 2025
కొడంగల్లో ఎడ్యుకేషన్ హబ్ ఉట్టి మాటేనా.?

విద్యా సంస్థల ఏర్పాటుతో కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్గా మారుతుందని భావించిన ప్రజలకు నిరాశే మిగులుతోందనే ప్రచారం సాగుతోంది. మెడికల్ కళాశాల, సమీకృత గురుకులాలు లగచర్లకు తరలింపు సరైంది కాదని, ఇక్కడే ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కొడంగల్ మండలంలోని అప్పాయిపల్లిలో మెడికల్ కాలేజీకి భూమిని సేకరించారు. అంతలోనే లగచర్ల, హకీమ్పేట్కు తరలించడంతో స్థానికంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
News November 15, 2025
NZB: గంజాయిని తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

ఎండు గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ వెంకటేష్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని భావం సాహెబ్ పాడ్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. అమీర్ ఖాన్ అనే వ్యక్తి బైక్పై 260 గ్రాముల ఎండు గంజాయిని తరలిస్తూ పట్టుబడినట్లు పేర్కొన్నారు.


